తెలంగాణ ప్రభుత్వంపై గొంతు చించుకొని అరుస్తున్న చంద్రబాబు పై జాలి వేస్తోందని తెలంగాణ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఆయనను చూస్తే నవ్వు కూడా వస్తోందనని చెబుతున్నారు.
చంద్రబాబు తీసిన గోతిలో తనే పడ్డట్లుగా పరిస్థితి మారిందని అన్నారు. తెలంగాణ కు సంబందించి అనేక కుట్రలు చేసిన చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. రేవంత్ రెడ్డి కేసులో చంద్రబాబు పాత్ర అంత నగ్నంగా బయటపడిన తర్వాత కూడా దానిని కప్పి పుచ్చుకోవడానికి గొంతు చించుకొని అరుస్తూ ఇది రెండు రాష్ట్రాల సమస్యగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇది తెలుగు రాష్ట్రాల సమస్య కాదు కేవలం చంద్రబాబు వ్యక్తి గత సమస్య అని అన్నారు. దీనిని ఆంద్ర ప్రదేశ్ ప్రజలు కూడా తిప్పి కొట్టాలని ఆయన సూచించారు. రేవంత్ రెడ్డి ఉదంతాన్ని తెలంగాణ కుట్రగా అభివర్ణించటం.. దొంగే.. దొంగా.. దొంగా.. అని అరిచినట్లుగా ఉందని హరీష్ రావు మండి పడ్డారు. చంద్రబాబుకు నిజంగా నీతి ఉంటే ఈ కేసు విచారణకు సహకరింఛి నిర్దోషిగా నిరూపించుకోవాలని ఆయన అన్నారు.
మరి టిఆర్ఎస్ టిడిపి నేతలను తమ పార్టీలోకి ఆకర్షించినపుడు ఇవన్నీ గుర్తుకు రాలేదేమో! దొరికిన వాడు మాత్రమే దొంగ.. దొరక్కపోతే దొర.. అనే సామెత నిజమే అనుకోవాలి.