- Advertisement -
మంద కృష్ణ మాదిగ. వార్తల్లో ఉండే వ్యక్తి. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టాలంటూ మంద కృస్ణ మాదిగ చిత్తూరు జిల్లా నుంచి రథయాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే హైకోర్టు మాత్రం రథయాత్రకు వెళ్లవద్దంటూ మంద కృష్ణ మాదిగకు అల్టిమేటం ఇచ్చింది. మీరు చేయాలనుకున్న రథయాత్ర కారణంగా ట్రాఫిక్ సమస్యలొస్తాయని, ఈ యాత్ర నిలిపివేయండంటూ హుకుం జారీ చేసింది. ఈ సింగిల్ బెంచ్ తీర్పుపై మంద కృష్ణ మాదిగ డివిజన్ బెంచ్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.