అకలేస్తే అన్నంపెడతా…అలసివస్తే ఆయిల్ పూస్త ఇది పాటలో విన్నాం …కాని ఆకలేసిన మేక ఏంచేసిందో తెలిస్తె షాక్ అవుతారు.మేకలు ఆకలేస్తే సాదారనంగా ఆకులు,అలములు తింటాయి.ఇది సాదారనం.
కాని విపరీదమైన ఆకలి వేసింది.తినడానికి దగ్గర్లో ఏవస్తువులూ లేకపోవడంతో చిర్రెత్తిన మేక యజమాని జేబులో ఉన్న రంగురంగుల కాగితాలు కనిపించాయి.అంతే ఇంకేముంది అమాంతం వాటిని లటక్కున తినేసింది.మేక తిన్నది మామూలు రంగుల కాగితాలు కాదండోయ్ రూ.2వేలనోట్లు .
{loadmodule mod_custom,GA1}
ఇంటి యజమాని స్నానం చేసేదానికి బాత్రూంకు వెల్లాడు.ప్యాంటు జేబులో పెట్టుకున్న రూ. 66వేల విలువ చేసే 2వేల రూపాయల నోట్లు అన్నీ మేక తినేసిందని తెలిసి.. లబోదిబోమన్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో ని కనౌజ్ జిల్లా సిలువాపూర్ గ్రామంలో జరిగింది.
సర్వేష్ కుమార్ పాల్ అనే ఆ రైతు ఇంట్లో జరుగుతున్న పనుల కోసం ఇటుకలు కొనేందుకు రూ. 66వేల నగదు జేబులో పెట్టుకున్నాడు. ఇంకేముంది తీరా వాటిని మేక తినేయడం చూసి జాగ్రత్తగా బయటకు తీసే ప్రయత్నం చేసినా, కేవలం రెండు నోట్లే బయటకు వచ్చాయి. అవి కూడా బాగా పాడైపోయి ఉన్నాయి. మిగిలిన 31 నోట్లను పూర్తిగా మేక జీర్ణం చేసుకుంది.
{loadmodule mod_custom,GA2}
తాను స్నానం చేస్తూ ప్యాంటు పక్కన పెట్టానని, ఆ ప్యాంటు జేబులోనే డబ్బులున్నాయని సర్వేష్ చెప్పారు. అన్నిరకాల కాగితాలను తినేసే అలవాటున్న మేక.. ఇప్పుడు డబ్బు కూడా తినేసిందని, అయితే అది కూడా తన బిడ్డలాంటిదే కాబట్టి ఏమీ చేయలేకపోతున్నానని తెలిపారు.నోట్లను తిన్న మేకును చూసేందుకు జనాలు తండోపతండాలుగా వస్తున్నారు.అంతేకాదండోయ్ ఆ మేకతో సెల్ఫీలు కూడా తీసుకుంటున్నారు.
{loadmodule mod_sp_social,Follow Us}