Friday, May 3, 2024
- Advertisement -

వీడు మనిషేనా.. కత్తెరతో భార్యను చంపి.. తాపీగా వీడియోగేమ్ తో..

- Advertisement -

రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో దారుణం చోటు చేసుకుంది. మనుషుల్లో ఈ రకం కృరమృగాలు తిరుగుతున్నాయా అన్నంతగా ఒళ్లు గగుర్పొడిచే సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను అత్యంత కిరాతకంగా చంపేసి ఆమె నెత్తుటి మడుగులో ఉండగా పక్కనే తాపీగా వీడియో గేమ్ ఆడుకుంటూ ఏంజాయ్ చేశాడు. ఈ దృశ్యం పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురిచేసింది. జోధ్ పూర్ లో నివసించే విక్రమ్ సింగ్, శివ్ కన్వర్ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

  గత కొంత కాలంగా భర్త ఏ పని చేయకుండా ఇంటి పట్టున ఉంటూ వీడియో గేమ్ ఆడుకుంటూ కాలం వెల్లదీస్తున్నాడు. శివ్ కన్వర్ కుట్టుపని చేస్తూ, కుటుంబ పోషణ భారాన్ని మోసేది. కష్టపడి పనిచేసే భార్యతో విక్రమ్ సింగ్ తరచుగా గొడవ పడేవాడు. నిన్న కూడా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన విక్రమ్ సింగ్ అక్కడే ఉన్న కత్తెరతో భార్యతను విచక్షణారహితంగా పొడిచి చంపాడు.

తీవ్ర గాయాలు కావడంతో రక్తపు మడుగులోనే శివ్ కన్వర్ కుప్పకూలిపోయింది. భార్య చనిపోయిందన్న బాధ కూడా లేకుండా విక్రమ్ సింగ్ ఆ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు ఫోన్ లో తెలిపాడు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చే సమయానికి భార్య పక్కనే వీడియో గేమ్ ఆడుకుంటూ కనిపించగానే పోలీసులు షాక్ తిన్నారు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు, శివ్ కన్వర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -