ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబుకి బిగ్ షాక్ తగిలింది. ఇన్నాళ్లు జగన్ అక్రమాస్తులపై రెచ్చిపోయిన బాబుకు ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడింది.2005లో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విచారణ జరపాలని నందమూరి తారకరామారావు సతీమణి లక్ష్మీపార్వతి ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. అయితే లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్పై చంద్రబాబు హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు.
స్టేతో ఇన్నాళ్లు జగన్పై విమర్శలు చేస్తూ నిప్పు అని చెప్పుకుంటున్నా బాబు ఇప్పుడు ఆదాయానికి మించిన ఆస్తులకేసు మెడకు చుట్టుకుంటోంది. దీర్ఘకాలంగా ఉన్న స్టేలను ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిన నేపథ్యంలో, ఈ స్టే రద్దుకాగా, కేసుకు సంబంధించిన విచారణకు హాజరు కావాలని లక్ష్మీ పార్వతికి సమన్లు అందాయి.ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఆమె ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు.కేసు స్టేటస్పై వచ్చేనెల 13న హైదరాబాద్ ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది. ఇన్నాళ్లు నిప్పులు అని చెప్పుకుంటున్న బాబు ఇప్పుడు ఎలా స్పందిస్తారో చూడాలి.