Monday, May 13, 2024
- Advertisement -

అనుక్షణం నాన్నే గుర్తొస్తున్నాడు: జగన్

- Advertisement -

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన తనయుడు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి ట్విటర్ లో స్పందించారు. వైఎస్ జయంతి నేపథ్యంలో జగన్ తన తండ్రితో అనుబంధాన్ని పంచుకొన్నాడు.

ఆయనను తాను చాలా మిస్ అవుతున్నానని జగన్ ట్వీట్ చేశారు. భౌతికంగా దూరమైన తండ్రి తనకు ప్రతి సమయంలోనూ గుర్తుకు వస్తున్నాడని.. ఆయన లోటును జగన్ గుర్తు చేసుకొన్నారు.

ఇలాంటి సమయంలో తనకు అభిమానులు, ప్రజలు అండగా నిలుస్తున్నారని.. వారు ఇస్తున్న సపోర్టే తనకు శక్తినిస్తోందని జగన్ అన్నాడు. రాజశేఖర్ రెడ్డి ఔన్నత్యం తనకు స్పూర్తిగా నిలుస్తోందని.. ముందుకు వెళ్లే శక్తని ఇస్తోందని జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దివంగత వైఎస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహించుకొంటున్నాయి. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో కూడా ఈ సందడి కనిపిస్తోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -