అదేంటీ.. లోన్ కోసం బ్యాంక్కు వెళ్తాం కానీ.. ఏటీఎంకు వెళ్లడమేంటీ అనుకుంటున్నారా..? అవునండీ.. దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంక్ ఐసీఐసీఐ సరికొత్త ఆఫర్ను అందించనుంది. ఏటీఎంలలో ఇన్స్టాంట్గా డబ్బులు తీసుకుంటున్నట్లుగా.. తక్షణ లోన్లు కూడా ఇవ్వనుంది. ఏటీఎం ద్వారా రూ. 15లక్షల వరకు వ్యక్తిగత లోన్లు అందించేందుకు ఐసీఐసీఐ సిద్ధమైంది. అయితే ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది.
ఎంపిక చేసిన కస్టమర్లు అని అనుకుంటున్నారా. అయితే కండీషన్స్ ఎలాఉంటాయో మందె తెలుసుకుంటె మంచిది.ప్రాధానంగాఇందుకోసం కంపెనీల నుంచి ఉద్యోగుల సమాచారం తీసుకుని.. అందులో నుంచి వ్యక్తిగత లోన్ల కోసం కొందరు కస్టమర్లను ఎంపిక చేస్తుంది. ఈ వినియోగదారులు ఏటీఎం ద్వారా నగదు ట్రాన్సాక్షన్ చేసుకున్నప్పుడు స్క్రీన్పై లోన్ గురించి మెసేజ్ వస్తుంది. అప్పుడు కస్టమర్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటే.. రూ. 15లక్షల వరకు లోన్ ఇవ్వనున్నట్లు ఐసీఐసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
అప్పుడు కస్టమర్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటే.. రూ. 15లక్షల వరకు లోన్ ఇవ్వనున్నట్లు ఐసీఐసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఐదేళ్ల గడువుతో ఈ లోన్ ఇస్తున్నట్లు పేర్కొంది. లోన్ ఎంత కావాలో సెలెక్ట్ చేసుకుంటే వెంటనే ఆ నగదు వినియోగదారుడి ఖాతాలోకి బదిలీ అవుతుంది.
మీకు లోన్ ఎంత కావాలో ఏటీఎం స్క్రీన్పైనే సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంతో పాటు వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు, నెలవారీ వాయిదాలు తదితర వివరాలను కూడా స్క్రీన్పై అందిస్తుంది. అవన్నీ నచ్చితే.. ఏటీఎంలలోనే లోన్ తీసుకోవచ్చు. ఐసీఐసీఐ నుంచి ఒక్కసారి కూడా లోన్ తీసుకోని వారికి సైతం ఈ అవకాశం కల్పిస్తున్నట్లు బ్యాంకు పేర్కొంది. కస్టమర్లకు సులభంగా లోన్లు అందించేందుకే ఈ ఆఫర్ను తీసుకొస్తున్నట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనూప్ బాగ్చీ తెలిపారు.
- Advertisement -
నిమిషాల్లో రూ.15 లక్షవరకు లోన్ సౌకర్యం పొందవచ్చును
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -