- Advertisement -
హైదరాబాద్లోని వనస్థలిపురంలో భారీ దోపిడి జరిగింది. ఏటీఎం మిషన్లలో డబ్బులు పెట్టే వాహనం నుంచి రూ. 70 లక్షల నగదును ఎత్తుకెళ్లారు దుండగులు.యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలలో క్యాష్ ఫిల్ చేస్తున్న సమయంలో సిబ్బంది దృష్టిని మరల్చి 70 లక్షలను తస్కరించారు.యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు పెడుతుండగా ఈ చోరి జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.