వివాహేతర సంబంధాలు పచ్చని కాపుల్లో చిచ్చు పెడుతున్నాయి. అక్రమసంబంధాల కారనంగా కుటంబాలు రోడ్డున పడుతున్నాయి. జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భార్య మోసం చేయడాన్ని ఓ భర్త తట్టుకోలేకపోయాడు. మారాలని ఎన్నిసార్లు హెచ్చరించినా ఆమెలో మార్పు రాలేదు. కొడుకును కూడా భార్తే చంపిందన్న అనుమానంతో భార్య తలను అతి కిరాతకంగా నరికిన భర్త, పోలీసులకు లొంగిపోయాడు. ఈ సంఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది.
కడప జిల్లా రాయచోటి సంబేపల్లి మండలం వడ్డెపల్లికి చెందిన పసుపులేటి వెంకటరమణకు అదే గ్రామానికి చెందిన రాణితో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలం పాటు వీరి కాపురం హాయిగానే సాగింది. ఈ క్రమంలో ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కలిగారు. కుటంబ పోషన నిమిత్రం వెంకటరమణ కువైట్ వెల్లాడు.
దీంతో పొరుగునే ఉన్న నాగేశ్వరరావుతో రాణికి అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న బంధువులు ఆమెను మందలించారు. ఆమె భర్తపై అలిగి పుట్టింటికి వెళ్లిపోయినా నచ్చజెప్పి కాపురానికి తిరిగిపంపారు. అయితే ఇద్దరు పిల్లల్లో ఒకరు ఇటీవల చనిపోవడంతో భార్యే ఈ హత్య చేసిందన్న అనుమానం వెంకటరమణలో బలపడింది.
దీనికి తోడు కువైట్ నుంచి తాను సంపాదించిన సొమ్ముకు జమాఖర్చులు సక్రమంగా చెప్పకపోవడం.. చేసిన అప్పులు తీరకపోవడంపై రాణిని వెంకటరమణ ప్రశ్నించాడు.. సరైన సమాధానం లేకపోవడంతో వెంకటరమణ కువైట్ నుంచి ఇంటికి తిరిగొచ్చి.. రాణి కదలికలను పసిగడుతూ వచ్చాడు.
ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం రాణి తన ప్రియుడు నాగేశ్వరరావుతో కలిసి బైక్పై వెళ్తుండగా వారిని వెంబడించి దుద్యాల చెక్పోస్ట్ వద్ద అడ్డుకున్నాడు. ఆ సమయంలో ప్రియుడు నాగేశ్వరరావు.. రాణిని అక్కడే దింపేసి భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. కోపంతో ఊగిపోతున్న వెంకటరమణ భార్యను చితకబాది.. సమీపంలోని పంటపొలాల్లోకి తీసుకెళ్లి గొంతుకోసి హతమార్చాడు.
ఇంకా పగ చల్లారక పోవడంతో తలను తెగ్గోసి 10 కి.మీ దూరంలోని సంబేపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.