Thursday, May 9, 2024
- Advertisement -

మాజీ ప్రియున్ని ముక్క‌లుగా న‌రికి కూర‌వండి ప్రియురాలు ఏం చేసిందంటే..?

- Advertisement -

తనను అన్ని రకాలుగా వాడుకొని.. తీరా పెళ్లి చేసుకుందామంటే నిరాకరించాడనే కోపంతో.. మాజీ ప్రియుడిపై ప్రియురాలు దారుణానికి ఒడిగట్టింది. మాజీ ప్రియుడిని చంపి అతని శరీర భాగాలను కూరొండి ఇంటి పక్కన ఉండే కూలీలకు వడ్డించింది.అతి జుగుప్సాకరమైరన ఈ సంఘటన యూఏఈలోని అజ్మాన్‌లో జరిగింది.

వివ‌రాల్లోకి వెల్తే ….మొరాకోకు చెందిన ఓ యువతి వృత్తిరీత్యా అజ్మాన్‌లో నివాసముంటోంది. ఆమెకు ఏడేళ్ల కిందట ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య చనువు ఏర్పడటంతో ప్రేమలో పడ్డారు. దాదాపు ఏడేళ్లుగా ఇద్ద‌రూ స‌హ‌జీవ‌నం చేశారు. ఆపై పెళ్లి చేసుకోవలసిందిగా మ‌హిళ కోరగా అతను నిరాకరించాడు. దాంతో ప్రియుడిపై కోపం పెంచుకున్న ఆ మహిళ ప్రియుడిని హత్య చేసి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికింది.

తనకన్నా చిన్నవాడైన ఫ్రెండ్, తనను దూరం పెడుతుండటం భరించలేకనే ఈ పని చేసినట్టు ఆ యువతి ప్రాసిక్యూషన్ ముందు అంగీకరించింది. ఈ ఘటన చానాళ్ల క్రితమే జరుగగా, ఇటీవల బాధితుడి సోదరుడు అతని గురించి వెతుకుతూ, యువతి ఇంటికి వెళ్లిన తరువాతే, ఈ దారుణ ఘటన బయటకు వచ్చింది.

బాధిత త‌మ్ముడికి ఆమెపై అనుమానం రావ‌డంతో అధికారులకు ఫిర్యాదు చేశాడు. దాంతో దర్యాప్తు ప్రారంభించిన అధికారులకు ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడిని ముక్కలు ముక్కలుగా నరికి మాంసాన్ని కూర వండి ఇంటికి సమీపంలో ఓ భవన కూలీలకు పెట్టానని. మిగిలిన మాంసాన్ని కుక్కలకు వేసి.. దంతాలను పిండి చేశానని తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -