Friday, March 29, 2024
- Advertisement -

అక్రమ సంబంధం…ఇదో అసక్తికర మైన లేడీ క్రైమ్ స్టోరీ….

- Advertisement -

ఇప్పటి వరకు విన్న క్రైమ్ స్టోరీలు వేరు…ఇప్పుడు వింటున్న కిలాడి లేడీ క్రైమ్ స్టోరీ వేరు. ఆమె కట్టుకున్న భర్తను వదిలేసి పది సంత్సరాలుగు ఓ వ్యక్తితో సహజీవనం చేస్తోంది. అదే సమయంలో తన ప్రియుడి స్నేహితడితో కూడా అక్రమ సంబంధం పెట్టుకుంది. వేధిస్తున్న తన పాత ప్రియుడిని, మరో కొత్త ప్రియుడితో హత్య చేయించిన ఓ మహిళ, అతన్ని పోలీసులకు పట్టించింది.హత్య తరువాత అతను తన కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతోనే తాను ఈ పని చేసినట్టు ఆమె పోలీసులకు వెల్లడించడం. ఈ సంఘటన తమిళనాడు జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెల్తే….తమిళనాడులోని నామక్కల్ ప్రాంతానికి చెందిన సెల్వి భర్త నుంచి విడిపోయి పిల్లలతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది.కుమారపాళయంకు చెందిన నేత కార్మికుడు వెంకటేశన్‌(38)తో పరిచయం ఏర్పడి సహజీవనానికి దారితీసింది. పది సంత్సరాలుగు ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు.కొద్దికాలంగా వెంకటేశన్ నిత్యం మద్యం తాగి వచ్చి వేధింపులకు గురిచేస్తున్నాడు. అదే సమయంలో వెంకటేశన్ స్నేహితుడు పెరుమాళ్‌తో సెల్వికి పరిచయమైంది.విషయం తెలుసుకున్న వెంకటేశన్ ఇద్దరినీ నిలదీయడంతో అతనని చంపేయాలని ప్లాన్ చేశారు.అతనికి మద్యం తాపించి, నదిలోకి తోసేశారు.

కార్మికుడు వెంకటేశన్ (38) గత నెల 8న అదృశ్యమై, ఆపై కావేరీ నదిలో శవమై కనిపించాడు. పోలీసులు కేసును విచారిస్తున్న క్రమంలో సెల్వి, ఆమె ప్రియుడు పెరుమాళ్ ను ప్రశ్నించగా, ఈ హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి.వేధింపులు తట్టుకోలేక వెంకటేశన్‌ను చంపేసినట్టు సెల్వి ఒప్పుకోవడంతోపాటు పెరుమాళ్‌ను పోలీసులకు పట్టించింది. పెరుమాళ్ తన కుమార్తెపై కన్నేశాడని, అందువల్లే అతన్ని పట్టించాలని నిర్ణయించుకున్నట్లు సెల్వి పోలీసుల విచారణలో వెల్లడించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -