Saturday, April 27, 2024
- Advertisement -

టాప్ లో భారత్.. ప్రమాదం తప్పదా ?

- Advertisement -

ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న దేశాల జాబితాలో చైనా, భారత్ గట్టిగానే పోటీ పడుతున్నాయి. వాణిజ్య, సాంకేతిక, ఆర్థిక పరంగా ఈ రెండు దేశాలు వేటికవే అన్నట్లుగా దూసుకుపోతున్నాయి. ఇక నిన్న మొన్నటి వరకు కూడా ఈ రెండు దేశాలు జనాభా పరంగా గట్టిగానే పోటీ పడ్డాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత రెండవ స్థానంలో ఇండియా ఉంది. అయితే తాజాగా ఐక్యరాజ్య సమితి ఇచ్చిన నివేదికల ప్రకారం.. వచ్చే ఏడాది నాటికి భారత్ చైనాను అధిగమించి అత్యాదిక జనాభా కలిగిన దేశంగా మారుతుందని ఐక్యరాజ్య సమితి తెలిపింది.

ప్రస్తుతం చైనా జనాభా 142.6 కోట్లు కాగా భారత్ జనాభా 141.2 కోట్లు.. అయితే ప్రస్తుతం జనాభా పరంగా భారత్ వృద్ది రేటు చాలా మెరుగ్గా ఉందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. 2050 నాటికి భారత్ జనాభా 166.8 కోట్లకు చేరే అవకాశం ఉందని కూడా ఐక్యరాజ్య సమితి అంచనాలు వేస్తోంది. ఇక ప్రపంచ జనాభా విజయనికొస్తే 2022 చివరి నాటికి 800 కోట్ల మార్క్ దాటే అవకాశం ఉందట. జూలై 11 న ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి ఈ విషయాలను నివేదికల ప్రకారం వెల్లడించింది. ఇక 2050 నాటికి ప్రపంచ జనాభా 1000 కోట్లకు విస్తావించే అవకాశం ఉందట.

మరి ఈ స్థాయిలో జనాభా పెరుగుదల వల్ల పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా మన దేశ జనాభా ప్రతి ఏటా కూడా మెరుగైన వృద్ది రేటు సాధించడం గమనార్హం. జనాభా పెరుగుదల వల్ల ఎన్నో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగాల కొరత, పర్యావరణం పై పెను ప్రభావం, వనరుల వాడకం విపరీతంగా పెరగడం వంటి ఎన్నో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల మనదేశ అభివృద్ది వెనుకడుగు వేసే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి జనాభా నియంత్రణపై ప్రభుత్వాలు చర్య తీసుకొని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Also Read: గూగుల్ క్రోమ్ వాడుతున్నారా .. జాగ్రత్త !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -