Friday, May 3, 2024
- Advertisement -

ఇండియా వద్దు ఫారెన్ కంట్రీస్ ముద్దు!

- Advertisement -

ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న దేశాల జాబితాలో మన దేశం కూడా ఒకటి. విద్యా, వైద్య, సాంకేతికత ఇలా అన్నీ రంగాల్లోనూ ఇండియా దూసుకుపోతుంది. దీంతో ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచంలోని ఎన్నో ప్రముఖ సంస్థలు ఇండియా వైపు చూస్తున్నాయి. అందువల్ల ఇతర దేశాలనుంచి ఇండియా కు వచ్చే వారి సంఖ్య కూడా నానాటికీ పెరుగుతూ వస్తోంది. ఇదిలా ఉంటే ఇండియాలో పుట్టి పెరిగిన చాలామంది మాత్రం మనదేశ పౌరసత్వాన్ని విడిచి పెట్టి ఇతర దేశాలలో స్థిరపడేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగాల పరంగా అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు ఎక్కువగా ఆకర్షితులవుతున్న ఇండియన్స్ .. అక్కడే స్థిరపడుతూ మన దేశ పౌరసత్వాన్ని కూడా విడిచిపేందుకు వెనుకాడడం లేదు. తాజాగా మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్తూ స్థిరపడుతున్న వారి నివేదికను ఇంటర్నేషనల్ మైగ్రేషన్(UN DESA) నివేదికను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 2020 నాటికి ఇతర దేశాల్లో స్థిరపడ్డారన భారతీయుల సంఖ్య 1.80 కోట్ల మంది ఇండియన్స్ వారి పౌర సత్వాన్ని వదులుకొని ఇతర దేశాల్లో స్థిరపడ్డారు అని పేర్కొంది.

ఇక విదేశాలకు వలస వెళ్లేవారిలో భారతీయుల తర్వాత మెక్సికన్లు, రష్యన్లు, చైనీయులు ఉన్నారు. భారతీయులను ఎక్కువగా ఆకర్షిస్తున్న దేశాలలో UAE, తర్వాత అమెరికా, సౌదీ అరేబియా ఉన్నాయి. ఈ దేశాలే కాకుండా స్వీడెన్, జర్మనీ, ఇటలీ, సింగపూర్ వంటి దేశాలలో కూడా చాలా మంది భారతీయులు స్థిరపడుతు ఇండియన్ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -