Thursday, May 2, 2024
- Advertisement -

RTA లో అవినీతి అనకొండలకు సీతయ్య స్వీట్ వార్నింగ్…

- Advertisement -

బదిలీల కోసం లంచాలంటూ ఉద్యోగులను వేధిస్తే తాటా తీస్తానంటూ ఆంధ్రప్రదేశ్ RTA  కమీషనర్ PSR ఆంజనేయులు   రవాణా శాఖ లోని అవినీతిపరులకు ఇచ్చిన వార్నింగ్ వీడియోనెట్టింట హల్ చల్ చేస్తోంది. గత ప్రభుత్వం హయాం లో RTA  శాఖ లో జరిగిన అవినీతి పర్వాలపై ఇప్పటి కే కొరడ ఝళిపిస్తోన్న ఈ IPS అధికారి తాజా వీడియో, రవాణా శాఖ లోపాతుకుపోయిన అవినీతి అనకొండల కు దడపుట్టిస్తోంది.
2015 నుండి బదిలీలు కాకుండా లంచాలిచ్చి అప్పటి రవాణాశాఖ కమీషనర్ ఫ్రీ హ్యాండ్ తో  ఆమ్యామ్యాలకు ఇష్ఠ్యా రాజ్యంగా మారిన RTA  డిపార్ట్మెంట్ లో ఇప్పటి కే అవినీతి అధికారులదుమ్ముదులుపుతున్న రవాణా శాఖ కమీషనర్ తాజా వీడియో సమావేశాల్లో డిప్యూటీ ఆర్టీఏ అధికారులకు, మోటర్ వెహికల్ ఇన్ స్పెక్టర్లుకు తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు..

ఏపిలో కొత్తగా ఏర్పడ్డ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతి, పారదర్శకత లో భాగంగా కఠినంగా వుండాలని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారు. ఈ విషయం లో ఎలాంటి అవినీతిఅధికారులను ఉపేక్షించవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో సీఎం ఆదేశాలను అమలు చేస్తూన్నారు రవాణా శాఖ ఉన్నతాధికారులు.

శాఖలోని అధికారులు బదిలీలకోసం ఉద్యోగుల నుండి లంచాలు వసూలు చేస్తున్నారనే  సమాచారం ఆయనకు రావడంతో బదిలీల్లో అక్రమాలకు పాల్పడుతున్న అనకొండలతో ప్రత్యేకమీటింగ్ ఏర్పాటు చేసిన ఆయన మోటర్ వెహికల్ ఇన్ స్పెక్టర్ ల నుండి డిప్యూటీ కమీషనర్ రేంజ్ స్థాయి అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన వీడియో ఇప్పుడుసామాజికమాధ్యమాల్లో వైరల్ అవుతోంది.  లంచాలు, రికెమెండెషన్ లు లేని వారికే మొదటి ప్రియారిటీ అన్న కోటాలో తాజా బదిలీలు రవాణ శాఖలో తొలిసారిగా జరిగాయని RTA ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఆ శాఖ కమీషనర్ గా బాధ్యతలు తీసుకున్న నాటినుండి ప్రైవేటు ట్రావెల్స్ ఆగడాలపై కఠిన చర్యలు, వాటితో పాటు దొంగ ఇన్ వాయిస్లతో లైఫ్ టాక్స్ఎగ్గొట్టిన డీలర్ల పై ఇప్పటికే సీరియస్ యాక్షన్ తీసుకున్నారు  కమీషనర్ PSR ఆంజనేయులు. తాజా గా జరిగిన బదిలీల ప్రక్రియ లో ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూ పారదర్శకంగా, కఠినంగాచేపట్టడంతో దాదాపు 300 మందికి పైగా ఉద్యోగులలో బదిలీలు నయాపైసా ఖర్చుకాకుండా జరిగాయని రవాణా శాఖ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు..

ఆర్టీఏ లో అవినీతిపై ఆంజనేయ యుద్దం

ఏపి RTA డిపార్ట్మెంట్ లో సంస్కరణలు చేపట్టాలనుకుంటున్న ఉన్నతాధికారులకు తనిఖీలకు వెళ్లిన కొద్దీ గత సర్కారు హయాంలో జరిగిన అవినీతి మూలాలు దిమ్మ తిరిగేలా చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రోడ్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ అడ్డంగా దోచుకున్న విధానం తెలుసుకున్న అధికారులు విస్తుబోతున్నారట. వాహనాల లైఫ్ టాక్స్ ఎగవేత- ఉచిత LLR పేరుతో వసూళ్ళు- డీలర్ల దోపిడీ- ఏజెంట్ల కక్కుర్తి – నకిలీ ఇన్ వాయిస్ లతో కోట్ల రూపాయల దోపిడీ విధానం- అయిన వాళ్లకు పప్పులూబెల్లాల పంచేయడంతో రికవరీకి అధికారులు ప్రత్యేక ప్రణాళికలు వేస్తూ తాట తీయడానికి సిద్ధమవుతున్నారు.
గత ప్రభుత్వం హయాం లో ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ గా వున్న. బాలసుబ్రహ్మణ్యం స్థానంలో వచ్చిన IPS అధికారి పీ.సీతారామాంజినేయులు తన బృందాలతో డిపార్ట్మెంట్ లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. PSR బృందం తనిఖీల్లో అవాక్కయే స్కాం లు బయటపడుతున్నాయి. రాష్ట్రం లో విజయవాడ- విశాఖపట్నం- అనంతపురం జిల్లాలో దాదాపు 46 మోటార్ వాహనాల షో రూం లపై రవాణా శాఖ అధికారులు జరిపిన మెరుపుదాడుల్లో నమ్మలేని నిజాలు బయటపడ్దాయి. రవాణా శాఖలో కీలకమైన ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రక్రియ లో కొందరు డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని అధారాలతో సహ వెలికి తీసారు.

విజయవాడ లో 19మంది డీలర్లు విశాఖపట్నం లో 22మంది అనంతపురంలో 5గురు డీలర్ల గుప్పిట్లో రాష్ట్ర రవాణా శాఖ ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ విభాగం లో జరిగిన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. వాహనాలను 50-60 వేల రూపాయలకు అమ్మినట్టు ఇన్ వాయిస్ లు తయారు చేసి.. రాష్ట్ర రవాణా శాఖ కు చెల్లించాల్సిన బీమా పన్నులను ఎగవేసినట్టుగా అధికారుల సోదాల్లో బట్టబయలు అయ్యుంది. అనంతపురం జిల్లాలో ఒకడీలర్ ఏకంగా 18 లక్షల రూపాయలు స్వాహా చేయడం బట్టబయలు కావడం తో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వున్న డీలర్లు దాదాపు 250-300 కోట్ల రూపాయలు బీమాటాక్స్ చెల్లించకుండా RTA ఖజానాకు సున్నంపూశారని అధికారుల దాడుల్లో తేలింది. ఆన్ లైన్ వ్యవస్థలోని కొందరు ఉద్యోగులు డీలర్లతో కుమ్మకై తమ శాఖకు రావాల్సిన ఆదాయాన్ని పక్కదారి పట్టించడం పై డీలర్ల తో దోస్తీ చేసిన ఉద్యోగులపై యాక్షన్ కి సిద్దమవుతున్నారు రవాణా శాఖ కమీషనర్ PSR ఆంజనేయులు.

రవాణా శాఖలో జరిగిన అవినీతి దందాను అధారాలతో సహా సీఎం జగన్ మోహన్ రెడ్డి కి ఇప్పటికే నివేదిక అందచేసిన కమీషనర్ ఇంటి దొంగల జాబితాని రెడీ చేస్తున్నారు. ఇక ఏపి వ్యాప్తంగా అన్ని వాహనాలకు రిజిస్ట్రేషన్ AP 39 పేరుతో జరిగిన దోపిడీ లో గత ప్రభుత్వం లోని పెద్దల హస్తం వుండటం తో వారి పాత్ర పై ఆధారాలు సేకరిస్తున్నారు రవాణా శాఖ కమీషనర్ PSR ఆంజనేయులు. AP 39 సిరీస్ వల్ల రాష్ట్రం లోని అన్ని జిల్లాలకు ఒకే నంబర్ వుండటం వల్ల ఏ వాహనం రిజిస్ట్రేషన్ ఏ ఆర్టీఏ కార్యాలయం పరిధిలో జరిగిందో తెలియని గందరగోళం రవాణా శాఖ లో నెలకొంది. ఈ విధానం ప్రారంభించిన ఆరునెలల్లోనే RTA కి ఏడుకోట్ల రూపాయలు నష్టం వచ్చిందని నిర్ధారించారు రవాణా శాఖ అధికారులు.

గతంలో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ముఖ్యమైన నంబర్లకు ఫ్యాన్సీ నంబర్లకు వేలం పాట ద్వారా ఆర్టీఏ శాఖకు లక్షల్లో ఆదాయ౦ వచ్చేది… అయితే AP 39 సిరీస్ విధానం వల్ల డిమాండ్ వున్న వాహనల నంబర్ను ఇప్పుడు ఉచితంగా ఇచ్చేస్తున్నారు అధికారులు. దీని వల్ల గత ఆరునెలల్లో సంస్థకు కోట్ల రూపాయలలో కన్నం పడిందని రవాణా శాఖ కమీషనర్ ఆంజనేయులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఐదేళ్ల కాలం లో స్వైపింగ్ మిషన్ల ద్వారా చేసిన లావాదేవీలకు ఇప్పుడు లెక్క తేలకపోవడంతో దాదాపు నలభై కోట్ల రూపాయల గోల్మాల్ పై విచారణ కు సిద్దమవుతున్నారు కమీషనర్.

ఇక ప్రభుత్వాన్ని అడ్డంగా పెట్టుకున్ని అనంతపురం జిల్లాకు చెందిన ఒక టీడిపి నేత రవాణా శాఖ లో LLR మేళాల పేరిట 30 వేలమందికి ఉచితంగా లైసెన్సు లు చేపట్టారు. అప్పటి ప్రభుత్వంలోని అధికారులతో లోపాయికారిగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మొదట ఉచితంగా LLR అని చెప్పి..తర్వాత మేళా ముగిసిన తర్వాత ముప్పై వేల LLR లకు తాను ఖర్చు పెట్టానని దీనికి పెద్దమొత్తం లో ఖర్చు అయ్యిందని తెలుగు దేశం ప్రభుత్వం హయామ్ లో డబ్బులు మెత్తం వసూలు చేసాడు. ఓ వైపు ప్రజలకు ఉచితంగా సర్వీస్ అంటూనే ప్రభుత్వం దగ్గర బిల్లులు వసూళ్లు చేసుకున్న కుంభకోణం ఇప్పుడు RTA శాఖలో సంచలనంగా మారింది. దీనిపై ఎంత మొత్తం చేతులు మారాయన్న దానిపై ఆర్థిక శాఖ అధికారుల వద్ద సాక్ష్యాలు సేకరిస్తున్నారు రవాణా శాఖ కమీషనర్ ఆంజనేయులు.

రవాణా శాఖ లో సంస్కరణల పేరిట జరిగిన అక్రమాలపై దృష్టి పెట్టిన రవాణా శాఖ కమీషనర్ తదుపరి చర్యలపై సీఎం ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయవనరుల్లో ఒకటైన రవాణా శాఖ లో కోట్ల రూపాయలు స్కాం లు బయటపడుతుండటం ఇంకా లోతుగా విచారణ చేస్తే ఇంకెన్ని స్కాం లు బయట పడుతాయో అని అవినీతి అధికారులు భయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -