తెలుగుదేశం అధినేత పాలన ఆల్ ఈజ్ వెల్ గా సాగుతోందని ఆ పార్టీ వారు అంటారు. అయితే ప్రతిపక్షాల నుంచి రకరకాల విమర్శలు వస్తున్నాయి.
బాబు పాలన తుగ్లక్ ను తలపింపజేస్తోందని కొంతమంది అంటుంటే.. అలా కాదు బాబు పాలన అవినీతి మయం అయిపోయిందని మరికొందరు అంటున్నారు. ఇదే నేపథ్యంలో బాబుపాలనపై ఆసక్తికరమైన విమర్శలు చేశాడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ, శాసనమండలిలో విపక్ష నేత సి.రామచంద్రయ్య.
రాయలసీమ ప్రాంతానికి చెందిన రామచంద్రయ్య అభిప్రాయ ప్రకారం.. ఇప్పుడు రాష్ట్రంలో ఒకే కులం సెంట్రిక్ గా పాలన సాగుతోంది. ఒక కులం కోసమే బాబు రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు. ఒక సామాజికవర్గం ప్రాతిపదికనే పాలన చేస్తున్నాడు. మరి రామచంద్రయ్య ఆ కులం పేరు ఏమిటో చెప్పలేదు కానీ.. ఆయన మాటల అంతరార్థం మత్రం సులభంగా అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
చంద్రబాబు పాలనలో ఆయన సొంత సామాజికవర్గానికే ప్రాధాన్యత దక్కుతోందని… పాలన అంతా కమ్మ వాళ్ల సెంట్రిక్ గా జరుగుతోందని.. వారికే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతోందని రామచంద్రయ్య అన్నాడని అనుకోవాల్సి వస్తోంది. మరి బాబు పాలనపై ఇలాంటి విమర్శలు కూడా రావడం విశేషమే. మరి వీటికి తెలుగుదేశం వారు ఏమని సమాధానం ఇస్తారో!