Friday, May 17, 2024
- Advertisement -

రోజా కి జగన్ వార్నింగ్.. ఇక రచ్చబండ బంద్

- Advertisement -

కుటుంబ సభ్యుల మధ్య వచ్చే తగాదాలను.. తీర్చే క్రమంలో టీవీల్లో రియాల్టీ షోలు వస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా బతుకు జట్కాబండి, రచ్చబండ, సంసారం ఒక చదరంగం.. ఇలా కొన్ని టీవీ షోలు బాగా ఫాపులర్ అయ్యాయి. ఈ నెపథ్యంలో భార్య భర్తల మధ్య వచ్చిన సమస్యలను పరిష్కారం చూపిస్తాయి.

కొన్నిసార్లు ఈ ప్రోగ్రాంకు వచ్చిన జంటలు రెచ్చిపోతాయి. భార్యను భర్త కొట్టడమో, భర్తను భార్య కొట్టడమో, కుటుంబం సభ్యులు కొట్టుకోవడమో జరుగుతుంది. అయితే ఈ రియాల్టీ షోలు అన్ని నిజం కాదని.. కేవలం డబ్బులు ఇచ్చి ఇలా చేయిస్తున్నారు అని చాలా మంది అంటున్నారు. భార్యభర్తలను కొట్టుకోమని కార్యక్రమ నిర్వాహకులే సూచిస్తారు. అన్నీరోజులు జంటలు రారు, అలాంటి సమయంలో నిర్వాహకులే నకిలీ జంటలను ఏర్పాటు చేసి ఈ షోని నడుపిస్తున్నారు. ఇక అన్ని షోలలో కంటే వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసే షో ‘రచ్చబండ’ బాగా రచ్చకెక్కింది.

ఈ షో పై ఇప్పటికే చాలా విమర్శలు వచ్చాయి. కార్యక్రమంలో రోజా చేసే ఓవారాక్షన్.. షోకి వచ్చిన జంతలకు చేయి చేసుకోవడం లాంటిబి బాగా హైలెట్ అయ్యాయి. రోజా చేస్తున్న ఈ రచ్చపై అటు వాళ్ల పార్టీలోను చర్చ జరుగుతుంది. ఈ సంగతి జగన్ వరకు వెళ్లడంతో.. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటివి చెయొద్దు అని రోజాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో షాక్ అయిన రోజా.. రచ్చ బందకు షోకి బై చెప్పినట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -