- Advertisement -
జమ్మూకశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విద్యార్థులతో వెళుతున్న ఓ బస్సు ప్రమాదానికి గురికావడంతో 11 మంది మరణించారు. మరో ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పూంఛ్ లోని ఓ కంప్యూటర్ శిక్షణ కేంద్రానికి చెందిన విద్యార్థులు మినీ బస్సులో ప్రయాణిస్తుండగా పీర్ కిగలీ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది.
మరణించిన వారిలో 9 మంది విద్యార్థినులు ఉన్నారు. ఈ దుర్ఘటనలో మరో ఏడుగురు తీవ్రగాయాలపాలయ్యారు. క్షతగాత్రులను షోపియాన్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యేంద్రపాల్ రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.