Thursday, May 9, 2024
- Advertisement -

ప‌వ‌న్ మ‌కాం అమ‌రావ‌తిలోనే…సొంతింటికి భూమిపూజ‌..

- Advertisement -

నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స‌మ‌యం అంతా రాజ‌కీయాల్లో గ‌డిపేందుకు మ‌రో ముంద‌డుగు ప‌డింది. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలోని కాజ దగ్గర సొంతింటి నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. మార్చి 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నిర్వహించనున్న విషయం తెలిసిందే.

పార్టీ కార్యాలయంతో పాటు, సొంత ఇల్లు కూడా రాజధాని ప్రాంతంలో ఉంటే బాగుంటుందని జనసేనాని నిర్ణయించుకున్నారు. దీంతో మంగళగిరి మండలం కాజలో రెండు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. దానికి నేడు భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భార్య లెజెనోవాతో కలిసి పవన్ పూజలు నిర్వహించారు. అమరావతికి అతి చేరువలో ఇంటి నిర్మాణం జరుగుతుంది. ఆరు నెలల్లోగా ఇంటి నిర్మాణాన్ని పూర్తిచేయనున్నారు. ఇక్కడే జనసేన కేంద్ర కార్యాలయం కూడా ఏర్పాటవుతుంది. ప్రజలకు మరింత చేరువకావడానికి సహకరిస్తుందని జనసేన కార్యకర్తలు పేర్కొంటున్నారు.

తాను ప్రజల్లోకి వెళ్లాలన్నా, ప్రజలు తన వద్దకు రావాలన్నా ఇక్కడ ఉంటేనే సులభమవుతుందని చెప్పారు. ఈ నెల 14 తరువాత తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. తన అభిప్రాయాలను ఎన్నడూ దాచుకోబోనని, సమస్యలు ఎదురైతే పారిపోయే మనస్తత్వం తనది కాదని అన్నారు. జనసేన ఆవిర్భావ మహాసభ నాడు తన మనసులోని మాటలను చెబుతానని పవన్ వ్యాఖ్యానించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -