Saturday, May 18, 2024
- Advertisement -

తెలుగుదేశం ఎంపీల నాటకాలకు జేసీ దివాకర్ రెడ్డి చెక్!

- Advertisement -

ఏపీ ప్రత్యేక హోదా కోసం పోరాడతామని అంటున్నారు తెలుగుదేశం ఎంపీలు. ఈ మేరకు వాళ్లు ఢిల్లీలో గట్టి ప్రకటనలే చేస్తున్నారు.

అవసరం అయితే తాము పదవులకు రాజీనామాలు చేయడానికి కూడా సిద్ధం అని వారు ప్రకటిస్తున్నారు.

తమ పార్టీకి చెందిన ఎంపీలు కేంద్రమంత్రి పదవులు వదలుకొంటారని.. తాము కూడా ఎంపీ పదవులకు రాజీనామా చేస్తామని కొంతమంది టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ రాజీనామాలతో తాము కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తామని వారు అంటున్నారు.

మరి వెనుకటికి తెలుగునాట రాజీనామా రాజకీయాలు గట్టిగానే నడిచాయి. ప్రత్యేక, సమైక్య ఉద్యమాల నేపథ్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలతో పెద్ద రాజకీయమే చేశారు. పార్టీలకు అతీతంగా అప్పట్లో రాజీనామా రాజకీయాలు నడిచాయి. మరి ఇప్పుడు తెలుగుదేశం నేతలు మళ్లీ రాజీనామాలు అంటున్నారు. అయితే ఇవి నిజంగానే సీరియస్ గా చేసేవేనా.. లేక ఏదో ఉత్తుత్తివేనా? అనే సందేహాలు కలుగుతున్నాయి.

మరోవైపు తెలుగుదేశం పార్టీకే చెందిన ఎంపీ దివాకర్ రెడ్డి చేసిన ప్రకటన కూడా ఆసక్తికరంగా ఉంది. ఏపీకి ప్రత్యేక హోదా దక్కదు అని ఆయన స్పష్టం చేశాడు. ఈ విషయంలో ఇక ఎవరేం మాట్లాడినా అవన్నీ నాటకాలే అని దివాకర్ రెడ్డి స్పష్టం చేశాడు. ప్రధానమంత్రి, బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి తదితరులతో మాట్లాడినప్పుడు తమకు ఈ విషయంలో స్పష్టత వచ్చిందని.. ఏపీకి ప్రత్యేక హోదా దక్కే సమస్యే లేదని దివాకర్ రెడ్డి కుండబద్దలు కొట్టాడు. మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? తెలుగుదేశం ఎంపీలు రాజీనామాల డ్రామాలు ఉత్తుత్తివే అని దివాకర్ రెడ్డి స్పష్టం చేశాడనుకోవాలా?!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -