Monday, April 29, 2024
- Advertisement -

పుల్వామా ఉగ్ర‌దాడి మాస్ట‌ర్ మైండ్ హ‌తం…

- Advertisement -

మ్ముకాశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడికి పధక రచన చేసిన ప్రధాన సూత్రధారి ఎలక్ట్రీషియన్ మహ్మద్‌ భాయ్ ఆదివారం జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో హ‌త‌మ‌య్యారు. ద‌క్షిణ క‌శ్మీర్‌లోని త్రాల్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. ఈ ఎదురుకాల్పుల్లో మొత్తం ముగ్గురు మిలిటెంట్లు హ‌త‌మైన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. గుర్తుప‌ట్ట‌లేని రీతిలో మిలిటెంట్లు మృత‌దేహాలు ఉన్న‌ట్లు వారు చెప్పారు. పింగ్లిష్ ప్రాంతంలో భ‌ద్ర‌తా ద‌ళాలు.. కార్డ‌న్ సెర్చ్ నిర్వ‌హించాయి.

ఇంటెలిజెన్స్ స‌మాచారం ఆధారంగా సోదాలు జ‌రిగాయి. అయితే మిలిటెంట్లు కాల్పులు జ‌ర‌ప‌డంతో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు జ‌రిపిన‌ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. 23 ఏళ్ల ఖాన్ ఎల‌క్ట్రీషియ‌న్‌గా చేస్తున్నాడు. గ్రాడ్యుయేట్ డిగ్రీ క‌లిగిన అత‌ను పుల్వామాలో నివ‌సిస్తున్నాడు. అయితే ఆత్మాహుతి దాడికి కావాల్సిన వాహ‌నాన్ని, పేలుడు ప‌దార్ధాల‌ను అత‌నే స‌మ‌కూర్చాడు. అతివాద భావజాలానికి ఆకర్షితుడై 2017లో జైషే మహ్మద్‌లో చేరాడు.

మొదట గ్రౌండ్‌ వర్కర్‌గా పనిచేసిన అహ్మద్‌ ఖాన్,. 2018 నుంచి క్రియాశీలకంగా పని చేస్తూ వచ్చాడు. మారుతీ ఈకో మినీ వ్యాన్‌తో పుల్వామాలో ఆత్మ‌హుతి దాడికి పాల్ప‌డ్డారు. ఫిబ్ర‌వ‌రి 27వ తేదీన ఖాన్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. దాడికి ప‌ది రోజుల ముందే ఈ వాహ‌నాన్ని ఓ జైషే అనుచ‌రుడు కొనుగోలు చేసిన‌ట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -