Monday, May 20, 2024
- Advertisement -

చంద్రబాబు, మోధీపై వాట్సాప్ లో జోకులు!

- Advertisement -

ప్రధాని మోడీ,చంద్రబాబులపై ఓ సరదా  జోక్  వాట్సాప్ లో తెగ  చక్కర్లు కొట్టేస్తోంది. అదేంటంటే….”ప్రతి పక్షాలు చేసే మూకుమ్మడి దాడి నుంచి తప్పించుకోవడం ఎలాగో ఆలోచిస్తూ బుర్ర బద్దలు కొట్టుకుంటోన్న  చంద్రబాబు బడలికతో  పక్క మీద వాలగానే ఆయనగారి  ఫోన్‌ మోగింది. దాన్ని చిరాగ్గా  అందుకున్న బాబుగారికి అవతలినుంచి…. ‘హలో, చంద్రబాబూజీ! నేను నరేంద్ర మోదీని…’అని  వినిపించింది. 

వెంటనే చంద్రబాబు  అలర్ట్‌ అయ్యారు. బాగోదని ‘నమస్తే సార్‌… ఏంటి సార్‌ ఇంతరాత్రి టైమ్లో ఇలా  ఫోన్‌ చేశారు? ఇంకా రెస్ట్ తీసుకోలేదా ? అని అడిగారట.దానికి సమాధానంగా ’ ‘ఇప్పుడే ట్విట్టర్లో అమరావతి శంకుస్థాపన గురించి నాలుగు ముక్కలు గీకి నీకు ఫోన్‌ చేస్తున్నా చంద్రబాబూ!ఇంతకీ   మీ జనాలు నా స్పీచ్ గురించి ఏమంటున్నారు’అంటూ కుతూహలంగా మోదీ అడిగారు .

‘‘దానికి సమాధానం చెప్పని చంద్రబాబు ముందు ఇది తేల్చండి సార్ అని……. శంకుస్థాపనకు  రెండ్రోజుల కిందట ఫోన్‌ చేసినప్పుడు ‘మీ రాష్ట్రం కోసం మనీ ప్యాకేజ్‌ తెస్తున్నానూ, అప్పుడే ఎవరికీ చెప్పొద్దు అందరి ముందే నేనే చెప్పేస్తా ’ అన్నారా, లేదా? మరి తేలేదేం?’’అని నిష్టూరంగా అడిగాడు చంద్రబాబు. మోదీ ఫెళ్లున నవ్వాడు. ‘నేను ఢిల్లీ నించి తెచ్చిన మనీ ప్యాకేజ్‌ స్టేజి మీదే నీ చేతుల్లో పెట్టాకదా చంద్రబాబూ! మర్చి పోయావా?’ అని అన్నాడు . చంద్రబాబు తికమక పడ్డాడు. ‘స్టేజిమీద నాకేం ఇచ్చారూ,మీ బొంద నా బొంద.. ఒట్టి మట్టీ, నీళ్లూ తప్ప..’ అన్నాడు. మోదీ మళ్లీ పడీపడీ నవ్వాడు.‘‘మరదేనయ్యా మగడా! ‘మ’ అంటే మట్టి, ‘నీ’ అంటే నీళ్లు… టోటల్‌గా మనీ ప్యాకేజ్‌ అంటే అదే మరి”!

ఇది ఎవరో క్రియేట్ చేసిన  జోక్ అయినప్పటికీ ఇప్పుడు వాట్సాప్ లో అదే చక్కర్లు కొడుతుంది. అంతెందుకు శంకుస్థాపన లో మోడీ రిక్తహస్తం చూపించి వెళ్ళిన తర్వాత… రాజకీయనాయకుల నుంచి సామాన్యుల వరకూ మోడీతో పాటు చంద్రబాబును కడిగి పారేశారు.ఆ బాధ నుంచి పుట్టుకు వచ్చిన జోకే ఇది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -