Thursday, May 16, 2024
- Advertisement -

లోకల్ బీజేపీ నాయకులకి సిగ్గుందా ?

- Advertisement -

కేంద్రం లో తమ పార్టీ ఉంది అని తెలిసినా ఏపీ ప్రయోజనాలకి తమా పార్టీ గండి కొడుతోంది అని తెలిసినా కూడా బీజేపీ జనాలు తమ నాయకుడు మోడీ నీ ఆయన పాలన నీ డప్పు కొట్టుకుంటూ చెప్పుకోవడం అప్పుడప్పుడూ సిగ్గు చేటుగా అనిపిస్తుంది. సొంత ప్రయోజనాల కోసం కేంద్రంలో వారు ప్రవర్తిస్తూ ఉంటే ఇక్కడ వారు వారిని కవర్ చేస్తూ ఉంటారు అన్నమాట. తాజాగా ఏపీ భాజపా చీఫ్ హరిబాబు.. హోదా గురించి కొత్త మాయమాటలను శుక్రవారం నాడు వినిపించారు.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వడం గురించి దానివలన వారికి చేకూరగల ప్రయోజనాల గురించి లేదా సాయం రూపంలో అంతకంటె ఎక్కువ మేలు చేయడం గురించి ఢిల్లీలో ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయిట. అయితే ఈ చర్చలు ఎప్పటివరకూ జరుగుతాయో మాత్రం ఆయన చెప్పలేదు. అదే సమయంలో.. ఏపీ రెవిన్యూ లోటుకు సంబంధించి సాయం అందించే విషయంలో కూడా ఇంకా లెక్కలు తేలుస్తున్నారట.

ఇచ్చిన సాయం చివరిది కాదుట. అలాగే పోలవరం విషయంలో దాన్ని కేంద్రం ఎంత త్వరగా పూర్తిచేస్తుందనే సంగతి.. చంద్రబాబు పనితీరును బట్టి ఆధారపడి ఉంటుందిట. ఈ స్టేట్ మెంట్లు అన్నీ గమనిస్తే.. కేంద్రప్రభుత్వం పాడుతున్న పాటలకు తాన తందానా అన్నట్లే కనిపిస్తుంది. ఇన్ని విషయాల్లో కేంద్రం మీద ఈగ వాలనివ్వకుండా మాటలు పేరుస్తున్న హరిబాబు – విశాఖపట్నం రైల్వేజోన్ అయ్యే విషయంలో మాత్రం కమిటీలతో నిమిత్తం లేకుండా.. వెంటనే జోన్ ప్రకటించాలని అడుగుతున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -