- Advertisement -
చెదురుమదురు ఘటనలు మినహా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటల వరకు 64 శాతం పోలింగ్ నమోదయిందని సంబంధిత అధికారులు తెలిపారు. ఆ రాష్ట్రంలోని రామనగర్ జిల్లాలో అత్యధికంగా 84 శాతం పోలింగ్ నమోదుకాగా, బెంగళూరు పట్టణంలో అత్యల్పంగా 44 శాతం నమోదైంది.
సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో ఉన్న వారు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. కాసేపట్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. తమ పార్టీయే విజయం సాధిస్తుందని కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ నేతలు చెప్పుకుంటున్నారు
ఉదయం 7గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తొలి గంటల్లోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో నిన్న రాత్రి వర్షం కురిసినప్పటికీ శనివారం మళ్లీ వాతావరణం మామూలుగా మారిపోయింది.