Friday, May 17, 2024
- Advertisement -

కెసిఆర్ కి సుడి తిరిగింది !

- Advertisement -

 

కెసిఆర్ కి భలే అదృష్టం పట్టుకుంది అంటున్నారు విశ్లేషకులు. కొన్ని ఉదాహరణలు కూడా చెబుతున్నారు.కేంద్రం నుంచి ఆయన సర్కారుకు రావలసిన పలు అంశాలు కెసిఆర్ కి చాలా తేలిగ్గా వచ్చేస్తున్నాయి అని వీటి కోసం ఇతర రాష్ట్రాలు చాలా తిప్పలు పడుతుంటే ఆయనకీ ఎక్కడ లేని బంపర్ ఆఫర్ లూ వస్తున్నాయి అని కొందరు అంటున్నారు.

కేంద్రం ఏ రాష్ట్రం తో ఏ రాష్ట్ర ప్రభుత్వం తో గొడవలు పెట్టుకునే పరిస్థితి కనపడ్డం లేదు. ఇప్పటికిప్పుడు లాంటివి చేయ్యబోరు అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పరిస్థితి లో బిల్లుల ఆమోదం కోసం రాష్ట్రాలని మచ్చిక చేసుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం వయు. ఇప్పుడు కెసిఆర్ కేంద్రం అవసరాన్ని గమనించి తన డిమాండ్ ని తెరమీదకి తీసుకొచ్చింది. 

అవి కూడా కాదన లేని డిమాండ్లు మరి. సో తెలంగాణా సర్కారు కి డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణానికి కావలసిన నిధుల విషయంలో భరోసా లభించింది.తెలంగాణ సర్కారు నిర్మించే డబుల్ బెడ్రూం ఇళ్లకు అవసరమైన సాయాన్ని కేంద్రం ఇస్తుందన్న హామీని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తాజాగా స్పష్టం చేశారు. 

సో ఇదొక్కటే కాక కేంద్రం దన్నుతో తాను అనుకున్న పనిని చేసే వెసులుబాటు టీఆర్ ఎస్ సర్కారు లభిస్తుంది. దీంతో.. తెలంగాణలోని డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం మరింత ఊపుతో ముందుకు సాగే అవకాశం ఉంది. ఈ తీపి కబురుతో పాటు.. మెదక్ లో నిర్మించాలని భావిస్తున్న నిమ్స్కు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -