Wednesday, May 22, 2024
- Advertisement -

మోడీ కన్నా మెరుగైన పాలకుడిని నేనే!

- Advertisement -

ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వరసగా వివిధ అంశాల గురించి స్పందించడం మొదలు పెట్టాడు. తన పార్టీ నుంచి బహిష్కృత నేతల గురించి తొలుత స్పందించి కేజ్రీవాల్ ఇప్పుడు.. తన పాలన గురించి స్పందించాడు.

తనకు తాను బెస్ట్ పాలకుడిని అని సర్టిఫికెట్ ను ఇచ్చుకొన్నాడు కేజ్రీవాల్. తను ప్రధానమంత్రి నరేంద్రమోడీ కన్నా ఉత్తమ పాలకుడిని అని కేజ్రీవాల్ ప్రకటించుకొన్నాడు.

తను ప్రజలనే కేంద్రంగా చేసుకొని పాలన చేస్తున్నానని.. మోడీ మాత్రం కార్పొరేట్లను, డబ్బున్న సంపన్నులను కేంద్రంగా చేసుకొని పరిపాలన కొనసాగిస్తున్నాడని కేజ్రీవాల్ వ్యాఖ్యానించాడు. పార్టీలోని అంతర్గత సమస్యల కన్నా.. ప్రజా సమస్యల మీదనే తను ఎక్కువగా దృష్టిపెడుతున్నానని కేజ్రీవాల్ చెప్పుకొచ్చాడు.

మొత్తానికి తనను తాను పొగుడుకోవడానికి తెరతీసినట్టుగా ఉన్నాడు కేజ్రీవాల్. ఎన్నికల సమయంలో ప్రజలు తనను ఎంచుకోవడం గురించి కూడా ఈయన ప్రస్తావించాడు. ఎన్నికల ముందు ఢిల్లీ ప్రజల ముందు రెండు ఛాయిస్ లు ఉన్నాయని.. తను 49 రోజుల పాటు అందించిన పాలన.. కొన్ని నెలల పాటు నరేంద్రమోడీ అందించిన పాలనలను పోల్చి చూసుకొని ప్రజలు తనకు ఓటేశారని.. భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని ఇచ్చారని  కేజ్రీవాల్ వ్యాఖ్యానించాడు. పరిపాలనలో మరిన్ని మార్పులు తీసుకొస్తామని.. ఢిల్లీ ప్రజలను అనందపెడుతూ పాలన కొనసాగిస్తామని కేజ్రీవాల్ చెప్పుకొచ్చాడు. మరి కేజ్రీవాల్ తనను తాను ప్రశంసించుకోవడం ఏమైనా బాగుందా?!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -