Monday, May 27, 2024
- Advertisement -

కేర‌ళ వ‌ర‌ద‌భాదితుల‌కు భారీ విరాలం ఇచ్చి వైసీపీ ఎమ్మెల్యే..

- Advertisement -

భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళకు అండగా నిలిచేందుకు దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వ‌చ్చి భారీగా విరాళాలు ఇచ్చారు. ఇక రాజ‌కీయ పార్టీలు, సినీ ప్ర‌ముఖులు, పారీశ్రామిక వేత్త‌లు ఇలా అంద‌రూ త‌మ‌కు తోచిన విధంగా వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకొనేందుకు విరాళాలు ఇచ్చారు. రాజ‌కీయ పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు త‌మ నెల వేత‌నాన్ని కూడా విరాలంగా ఇచ్చారు.

అయితే వైసీపీ ఎమ్మెల్యే వ్య‌క్తిగ‌తంగా భారీ విరాలాన్ని ప్ర‌క‌టించారు. కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్ అధినేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి కోటిరూపాయ‌ల వ్యక్తిగతంగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఈ విరాళాన్ని జమ చేయనున్నట్టుగా వివరించారు. కేరళ సీఎం పినరాయి విజయన్‌ను కలిసి ఈ విరాళం చెక్‌ను అందించనున్నట్టుగా ఆయన వివరించారు. ఈ నెల 28,29 తేదీల్లో తను కేరళ వెళ్లి.. సీఎం అపాయింట్‌ను తీసుకుని విరాళం చెక్‌ను అందించనున్నట్టుగా తెలిపారు.

వరద బాధితుల పునరావాసం కోసం, ఇతర కార్యక్రమాల కోసం ఈ డబ్బును వినియోగించమని కోరనున్నామన్నారు. కేరళ వరదల బాధితుల కోసం ఏపీ ప్రముఖుల నుంచి వచ్చిన భారీ విరాళాల్లో ఇది ఒకటి. ఇది వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కేరళ వరద బాధితుల కోసం కోటి రూపాయల మొత్తాన్ని విరాళంగా ప్రకటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -