Thursday, May 16, 2024
- Advertisement -

జగన్ కు మద్దతు ఇచ్చిన స్పీకర్ కోడెల

- Advertisement -
Kodela Fire Kalva

అవును ఇది నిజమే. తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియర్ నేత.. అసెంబ్లీ స్పీకర్ అయిన కోడెల శివప్రసాద్ రావు.. ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడారు. ఎప్పటికప్పుడు టీడీపీ సర్కారు అవినీతి పాలనను.. అక్రమాలను బయటపెడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ మాటలకు స్పీకర్ అయిన కోడెల శివప్రసాద్ రావు మద్దతుగా మాట్లాడం.. అందరిని ఆశ్చర్యనికి గురి చేస్తోంది. ఈ ఘటన ఈ రోజు ఆ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా చోటు చేస్కోంది.

విషయంలోకి వెళ్తే.. ఈ రోజు ఉదయం బడ్జెట్ సమావేశాలు మొదలు కాగానే స్పీకర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాట్లాడటానికి పదే పదే మైకును ఇచ్చారు. దాంతో ఆ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌,టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులుకు చాలా కోపం వచ్చింది. దాంతో ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డికి మైకు ఎలా ఇస్తారు అని సభలో స్పీకర్ నే ప్రశ్నించాడు. స్పీకర్ నే ప్రశ్నించడంతో.. టీడీపీ కి చెందిన నేతలు, వైసీపీకి ఎమ్మెల్యేలు, మిగత పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. దాంతో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు.. శ్రీనివాసులుపై తన ఆగ్రహం వ‍్యక్తం చేశారు.

సభలో ఛైర్‌ను ప్రశ్నించవద్దని ఈ సందర్భంగా స్పీకర్‌ కాల్వ శ్రీనివాసులును గట్టిగా  హెచ్చరించారు. తన అధికారాలనే ప్రశ్నిస్తావా.. ఎక్కువ మాట్లాడోద్దు అంటూ.. కాల్వకు స్పీకర్‌ దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చారు. అధికార పక్షానికి చెందిన అందరూ దాడి చేస్తే ఎలా అంటూ కాల్వపై ఆగ్రహం చెందారు. అయినా సభలో ప్రతిపక్ష నేతకు మైకు ఇవ్వకుండా.. ఎవరికి ఇవ్వాలి అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. సభలో సభ అధ్యక్షుడు ముఖ్యమంత్రి తో పాటు ప్రతిపక్ష నేత కూడా సమానమే అని తెలిపాడు. ఉన్నట్లు ఉండి స్పీకర్ ఈ రెంజ్ లో మాట్లాడటంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -