Friday, March 29, 2024
- Advertisement -

లాలూ ప్రసాద్​ యాదవ్​ కు బెయిల్

- Advertisement -

బీహార్ పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్‌కు జార్ఖండ్ హైకోర్టు ఇచ్చింది. ప్రస్తుతం ఆయన ‘దుమ్కా ట్రెజరీ కేసు’గా పిలువబడే ఈ కేసులో జార్ఖండ్ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో ఎయిమ్స్ లో చికిత్స తీసుకుంటున్నారు. దాణా కుంభకోణానికి సంబంధించి విడుదలైన నిధుల్లో రూ.3.13 కోట్లు కాజేశారన్న ఆరోపణల కేసులో ఆయన్ను కోర్టు దోషిగా తేల్చి జైలు శిక్ష విధించింది.

2017 డిసెంబర్ నుంచి ఆయన జైలులోనే గడుపుతున్నారు. లాలూ తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో పోయినేడాది మాత్రమే ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. లాలూ జైలులో ఉన్నప్పుడు పార్టీని ఆయన కొడుకు తేజశ్వి యాదవ్ ముందుండి నడిపించాడు. గత ఏడాది జరిగిన బీహార్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు దక్కించుకొని పార్టీని అతిపెద్ద పార్టీగా మార్చాడు.

అయితే ప్రతిపక్ష నితీష్ కుమార్ పార్టీ జనతాదళ్ యునైటెడ్ .. బీజేపీతో కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఆరోగ్యం బాగాలేదన్న కారణంతో రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చేరిన ఆయన అక్కడే చికిత్స పొందారు. ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ ఎయిమ్స్ కు ఆయన్ను తరలించారు. కాగా, దాణా కుంభకోణానికి సంబంధించిన నాలుగు కేసుల్లో ఇప్పటికే మూడింటికి ఆయనకు బెయిల్ లభించింది.

ఆరోజు తో కరోనా పోతుంది.. ఆరోగ్య శాఖ వెల్లడి..!

వాట్సప్‌ వాడే వారి డేటా మొత్తం లీక్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -