టెక్నాలజీ పెరిగిన కొద్దీ జాగ్రత్తలూ మరింత పెరగాలి. మన గురించి మనకంటే ఇంటర్నెట్కే ఎక్కువ తెలుస్తున్న రోజుల్లో బతుకుతున్నాం కాబట్టి ఏమరుపాటుగా ఉండకూడదు. వాట్సప్ వినియోగదారుల సమాచారం సైబర్ దాడికి గురయ్యే ప్రమాదముందని దేశ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (సీఈఆర్టీ) హెచ్చరించింది.
వాట్సాప్, వాట్సాప్ బిజినెస్ యాప్లలో వినియోగదారుల సున్నితమైన సమాచారాన్ని పక్కదారి పట్టించే సాంకేతిక లోపాన్ని గుర్తించినట్లు సీఈఆర్టీ వెల్లడించింది. దీని ద్వారా వినియోగదారుల వ్యక్తిగత సమాచారం సైబర్ ముప్పునకు గురయ్యే ప్రమాదముందని హెచ్చరించింది.
వాట్సాప్ v2.21.4.18, వాట్సాప్ బిజినెస్ యాప్ v2.21.32 వర్షన్లలో ఈ లోపాన్ని గుర్తించినట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో గూగుల్ ప్లే స్టోర్లో ఉన్న వాట్సాప్ అప్డేట్ వెర్షన్ను వినియోగదారులు డౌన్లోడ్ చేసుకోవాలని సీఈఆర్టీ సూచించింది.
బండి సంజయ్ పై ఆ మంత్రి సంచలన వ్యాఖ్యలు