Thursday, May 2, 2024
- Advertisement -

మైన‌ర్ బాలిక‌పై …ఐదుగురు మైన‌ర్ల అత్యాచారం..

- Advertisement -

రాష్ట్రంలో మ‌హిళ‌లు, మైప‌ర్ బాలిక‌ల‌పై అత్యాచారాలు ఏమాత్రం త‌గ్గ‌డంలేదు. ప్ర‌భుత్వాలు ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్నా ఆటికి అడ్డుక‌ట్ట వేయ‌లేక పోతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా పుంగ‌నూరులో మ‌రో ఘోరం చోటుచేసుకుంది. స్థానిక భగత్ సింగ్ కాలనీలో 11 ఏళ్ల బాలికపై ఐదుగురు మైనర్ల అత్యాచారం చేశారు. డబ్బులు ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి 14 ఏళ్ల బాలుడు ఆ బాలికను లొంగ దీసుకున్నాడు. అతడు లైంగిక వాంఛలు తీర్చుకున్న తర్వాత అతడి నలుగురు స్నేహితులు కూడా ఆమెపై అత్యాచారం చేశారు.

మూడు నెలలుగా వారు బాలికపై అత్యాచారం చేస్తున్నారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. దీంతో బెదిరిపోయిన బాలిక తనలో తానే కుమిలిపోతోంది. బాలిక ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రావ‌డంతో ప‌సిగ‌ట్టిన త‌ల్లిదండ్రులు పోటీసుల‌కు ఫిర్యాదు చేశారు. నిందుతులంతా మైర్లు కావ‌డంతో వారిని అదుపులోకి తీసుకోవ‌డంలో వెనుకంజ‌వేశారు.

బాలికను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలికపై అత్యాచారం జరిగిందని డాక్టర్లు ధృవీకరించారు.

గత మూడు నెలలుగా బాలికను లైంగికంగా వేధిస్తున్న నలుగురు నిందితులను స్థానికులు పట్టుకొని చితక బాదారు. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకునే ప్రమాదం ఉండటంతో.. బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు నిందుతుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -