ఆయన టీడీపీ రాజకీయాలలో తలపండిన సీనియర్ నాయకుడు. చిత్తూరు జిల్లాలో తిరుగులేని నాయకుడు. కాని ఇప్పుడు పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. ఆయనను పక్కన పెట్టేందుకు బాబు మైండ్గేమ్ మొదలు పెట్టారనె వార్తల వినిపిస్తున్నాయి. నాయకులను వసరం ఉన్నప్పుడు వాడుకోవడం అవసరం తీరాక వారిని పక్కనపెట్టడం బాబు అలవాటె. ఇప్పుడు అట్లాంటి సీన్కు తెరలేపుతున్నారు బాబు.
చిత్తూరు జిల్లా నగరి నియేజకవర్గంలో గాలి ముద్దమకృష్ణమనాయుడు బలమైన, ప్రజాభిమానం ఉన్న నేత. 2014 ఎన్నికల్లో వైసీపీ నేత రోజాపై స్పల్పతేడాతో ఓడిపోయాడు. అయితే ముద్దుకృష్ణమను వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీలో లేకుండా చేసేందుకే కొందరు నియోజకవర్గ నేతలు పావులు కదుపుతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి కారనం లేకపోలేదు.
వైసీపీ ఎమ్మెల్యే రోజాకి పోటీగా వాణి విశ్వనాథ్ ను తీసుకురావాలని కొందరు తమ్ముళ్లు స్కెచ్గీశారు. గ్లామర్ పాలిటిక్స్ కు పోటీగా గ్లామర్ ఉన్న నటినే పోటీలో పెట్టాలని కొత్త సూత్రీకరణను తెరపైకి తెచ్చారు. అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టారు. వచ్చే ఎన్నికల్లో నగరి నుంచి వాణి విశ్వనాథ్ను పోటీలోకి దింపాలని పావులు కదపడం మొదలెట్టారు. ఈ విషయాన్నిచంద్రబాబుకు తెలిపేందుకు మీడియాలో హైప్ క్రియేట్ చేశారు.
వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ మధ్య నియోజక వర్గ వ్యవహారాల్లో కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇంకోపక్క గాలి కుమారులు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి రాజకీయ భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటున్నారు. స్థానికంగా ఇంత బలమైన నేత ఉండగా.. మాజీ సినీ నటిని నగరికి తీసుకురావాల్సిన అవసరం ఏముందనేదే గాలి వర్గంలో తీవ్రంగా జరుగుతోంది.
ఒకవేళ టీడీపీ అధినాయకత్వం ఉద్దేశం అదే అయితే.. స్థానికంగా టీడీపీలో అసంతృప్తులు తప్పవనే అనిపిస్తోంది. వాణీకి మద్దతు ఇచ్చే టీడీపీ నాయకులు ఎవరనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఎన్నోయేళ్లుగా నగరి నియోజక వర్గంలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ వస్తున్న గాలి వర్గంలో ఇప్పటికే ఈ చర్చ మొదలైందని సమాచారం. ఈ సారి ఎన్నికల్లో సీటు ఇవ్వకపోతె తనదారి తను చూసుకోవడం ఖాయం. మరి సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.