Friday, April 19, 2024
- Advertisement -

పలమనేరులో దారుణం.. కూతురు ప్రియుడిని ముక్కలుగా నరికేసిన తండ్రి…!

- Advertisement -

చిత్తూరు జిల్లా పలమనేరులో పరువు హత్య తీవ్ర కలకలం రేపింది. తన కూతురితో తిరుగుతున్న ఓ యువకుడిని యువతి తండ్రి దారుణంగా చంపేసి ముక్కలుముక్కలుగా నరికి తన పొలంలో పాతిపెట్టేశాడు. పలమనేరు మండలం పెంగరగుంట గ్రామానికి చెందిన ధనశేఖర్(23) గత కొంత కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి తండ్రి అతడిని పలుమార్లు హెచ్చరించాడు. అయితే ధనశేఖర్ ఆ యువతిని ప్రేమిస్తూనే ఉన్నాడు.

దాంతో ఆ యువకుడిపై కక్ష్య పెంచుకున్న యువతి తండ్రి అతడిని కిరాతకంగా చంపేసి ముక్కలుగా నరికి తన పొలంలోనే పాతిపెట్టాడు. ధనశేఖర్ కనిపించడం లేదని అతడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పలమనేరు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. తమదైన స్టైల్లో యువతి తండ్రిని విచారణ చేయడంతో అసలు నిజం బయట పెట్టాడు.

పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాన్ని తాను పాతిపెట్టిన ప్రదేశం నుంచి వెలికి తీశాడు. తన కూతురితో తిరగొద్దని ధనశేఖర్‌ను ఎన్నిసార్లు హెచ్చరించినా పట్టించుకోకపోవడంతోనే తాను ఈ దురాగతానికి పాల్పడినట్లు బాబు పోలీసుల ఎదుట అంగీకరించాడు. యువతి తండ్రిని అదుపులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కరోనాతో ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత

పుకార్లు నమ్మకండి.. నా ఔషధానికి ఇంకా అనుమతులు రాలేదు : ఆనందయ్య

ఎన్టీఆర్ పేదల ఆకలి తీర్చిన యుగపురుషుడు : వైఎస్ షర్మిల

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -