బ్రిటన్లో మరోసారి లాక్డౌన్ విధించారు. కొత్తరకం కరోనా వైరస్ విజృంభిస్తుండడం వల్ల దాన్ని అరికట్టడానికి లండన్, దక్షిణ ఇంగ్లాండ్ సహా పలు ప్రాంతాల్లో లాక్డౌన్ విధిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి ఈ లాక్డౌన్ అమల్లోకి వస్తుందని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.
మూడు దశల లాక్డౌన్ పద్ధతిని అవలంబిస్తున్న బ్రిటన్.. లండన్లో ఇప్పటికే మూడో దశను అమలులోకి తీసుకొచ్చింది. తాజాగా నాలుగో టైర్ లాక్డౌన్ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం అత్యవసరం కాని వ్యాపారాలన్నీ మూసేయాల్సి ఉంటుంది.
మరోవైపు క్రిస్మస్పై ఈ లాక్డౌన్ తీవ్ర ప్రభావం చూపనుంది. మూడు కుటుంబాలు కలిసి పండుగ నిర్వహించుకునేలా అవకాశం కల్పించనున్నట్లు ఇదివరకే ప్రధాని ప్రకటించగా.. టైర్-4 లాక్డౌన్ ఉన్న ప్రాంతాల్లో ఈ వెసులుబాటు ఉండదని తాజాగా స్పష్టం చేశారు. ఈసారి క్రిస్మస్ను ఒక ప్రణాళిక ప్రకారం నిర్వహించుకోలేకపోతున్నందుకు చాలా బాధగా ఉందని ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు.