Friday, May 10, 2024
- Advertisement -

బాలయ్యకు కోర్టు నోటీసులు.. హాజరవ్వాల్సిందే..!

- Advertisement -

నందమూరి నటసింహం బాలకృష్ణకు లోక్ అదాలత్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే హోదాలోని ఈ స్టార్ హీరోకు న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. తమ వద్ద దాఖలు అయిన ఒక పిటిషన్ విచారణకు హాజరు కావాల్సిందిగా బాలయ్యను న్యాయస్థానం ఆదేశించింది.

మరి బాలయ్య ఇప్పుడు కోర్టుకు హాజరవుతాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారం పూర్వపరాలు ఇలా ఉన్నాయి…

బాలయ్య అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న విషయం తెలిసిందే. ఈ హోదానే ఆయనకు ఇప్పుడు కోర్టు నోటీసులకు కారణం అవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే.. హిందూపురం, పెనుకొండల మధ్య రోడ్డు విస్తరణకు సంబంధించి న ప్రతిపాదన ఒకటి ఉంది. ఇది దశాబ్దాలుగా ఉన్న ప్రతిపాదన. ప్రభుత్వం ఈ రోడ్డు విస్తరణ చేపట్టడం గురించి ప్రైవేటు వ్యక్తులు కూడా భూములను ఉచితంగా ఇచ్చారు. అయితే ఇంత వరకూ విస్తరణ మాత్రం జరగలేదు!

ఇలాంటి నేపథ్యంలో భూములిచ్చిన వారు దీనిపై కోర్టుకు ఎక్కారు. తాము ఉచితంగా భూములు ఇచ్చినా.. రోడ్డు విస్తరణ చేపట్టలేదు.. ప్రజలకు సౌకర్యాలను ఏర్పాటు చేయలేదు.. అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకొన్న లోక్ అదాలత్ దీనికి బాధ్యులకు నోటీసులు జారీ చేసింది. ఇలా నోటీసులు అందుకొన్న వారిలోకొంతమంది ప్రభుత్వ అధికారులతో పాటు హిందూపురం ఎమ్మెల్యే హోదాలోని బాలయ్య బాబు కూడా ఉన్నాడు. మరి ఈ నోటీసులకు బాలయ్య ఏమని సమధానం చెబుతాడో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -