- Advertisement -
భాజాపా నుంచి లోక్సభ ఎన్నికల బరిలోకి నిలిచిన టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ వివాదంలో చిక్కకున్నారు. ఈస్ట్ ఢిల్లీ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న గంభీర్ రెండు ఓటర్ కార్డులు కలిగివున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆమ్ అభ్యర్థిని అటిషి మార్లెనా ట్విటర్లో ద్వారా తెలిపారు. ఢిల్లీలోని రెండు నియోజకవర్గాల్లో గంభీర్కు ఓట్లు ఉన్నాయని వెల్లడించారు. కారోల్ బాగ్, రాజిందర్ నగర్లో ఓటు ఉన్నట్టు ట్వీట్ చేశారు.
ప్రజా ప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 125ఏ ప్రకారం ఇది నేరమని, దీనికి ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించొచ్చని తెలిపారు.అంతేగానీ, గంభీర్పై తక్షణ చర్యలు చేసే అవకాశం మాత్రం లేదు.