- Advertisement -
ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన శంకరపల్లి మండలంలోని టంగుటూరు గ్రామంలో చోటుచేసుకుంది. పెల్లికి ఇరు కుంటుంబాలు ఒప్పుకోక పోవడంతో ప్రేమికుల జంట ఆత్మహత్యచేసుకున్నారు. ప్రేమకు పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఓ యువతి ప్రాణాలు తీసుకోగా, ప్రియురాలి మరణవార్త తెలిసిన యువకుడు తట్టుకోలేక ఉరి వేసుకుని ప్రాణాలు వదిలాడు.
శంకర్ పల్లిలోని టంగుటూరులో ఉన్న ఎల్లేశ్, అదే ప్రాంతానికి చెందిన లావణ్య ప్రేమించుకున్నారు. అయితే వీరి వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో మనస్తాపం చెందిన యువతి లావణ్య కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో ఈ రోజు ఉదయం చికిత్స పొందుతూ చనిపోయింది. అయితే ఈ వార్త తెలిసిన ఎల్లేశ్ తట్టుకోలేకపోయాడు. వెంటనే ఇంటికి సమీపంలోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనతో టంగుటూరులో విషాద ఛాయలు నెలకొన్నాయి.