- Advertisement -
మహారష్ట్రలోని గడ్చిరోలిలో మావోయిస్టులు పెట్రేగిపోయారు. ఉదయం రోడ్డు పనులు నిలిపివేయాలని 27 వాహనాలకు నిప్పు పెట్టి దగ్థం చేసిన మావోలు మరోసారి రెచ్చిపోయారు. అంతటితో ఆగకుండా భద్రతాబలగాల లక్ష్యంగా బాబు దాడులకు తెగబడ్డారు.భద్రతా దలాల వాహనాన్ని శక్తివంతమైన IEDని పేల్చడంతో 10 మంది జవాన్లు మృతిచెందారు. భారీ విస్పోటనం కారణంగా వాహనం తునాతునకలైంది
మరో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. జాంబిర్కేడ అటవీ ప్రాంతం గుండా వెళ్తున్న క్రమంలో ఈ దారుణం జరిగింది . గత 24 గంటల్లో మావోలు రెండుసార్లు దాడులకు తెగబడ్డారు. సంఘటనా స్థలంలో వామోలకు, భద్రతా దలాలకు మధ్య ఎదురు కాల్పులు జరుగతున్నట్లు సమాచారం.