Tuesday, April 23, 2024
- Advertisement -

మ‌హేశ్ ద‌త్త‌త గ్రామంలో చురుగ్గా ప‌నులు

- Advertisement -

సినిమాలో మాదిరి మ‌హేశ్‌బాబు రియ‌ల్‌గా చేస్తున్నాడు. ఊరిని ద‌త్త‌త తీసుకొని అభివృద్ధి ప‌నులు చేయ‌డం శ్రీమంతుడు ప్ర‌ధాన స్టోరీ. ఆ సినిమా ప్ర‌భావంతో మ‌హేశ్‌బాబు రెండు గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకున్నాడు. త‌న తండ్రి స్వ‌గ్రామం గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెంను ద‌త్త‌త తీసుకున్నాడు. దాని త‌ర్వాత తెలంగాణలోని మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా కొత్తూరు మండ‌లంలోని సిద్ధాపురం గ్రామాన్ని ద‌త్త‌త తీసుకున్నాడు. ఈ రెండు గ్రామాల్లో అభివృద్ధి ప‌నులు శ‌ర‌వేగంగా కొన‌సాగుతున్నాయి. త‌ర‌చూ మ‌హేశ్ భార్య న‌మ్ర‌త శిరోద్క‌ర్ ప‌నులను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. అభివృద్ధి ప‌నుల‌పై స‌మీక్ష చేస్తూ ప‌నులు చురుగ్గా అయ్యేలా చేస్తున్నారు.

ఏదో దత్తత తీసుకున్నామంటే.. ప్రచారం కోసం తీసుకున్నామనే ధోరణి కాకుండా ద‌త్త‌త అనే పేరును నిజం చేస్తున్నాడు మహేశ్. అభివృద్ధి కార్యక్రమాల‌ను అమ‌లు చేస్తూ ఆ ప‌నుల‌ను సమీక్షిస్తున్నాడు. మహేశ్ బిజీగా ఉండ‌డంతో అత‌డి భార్య న‌మ్ర‌త శిరోద్క‌ర్ స్వయంగా పనులు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. త‌ర‌చూ ద‌త్త‌త గ్రామాల్లో ప‌ర్య‌టిస్తూ ప‌నుల తీరు ప‌రిశీలిస్తున్నారు. కొత్తూరు గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అంద‌ర్నీ ఆక‌ర్షిస్తున్నాయి. కొత్తూరులో ఒక పాఠ‌శాల బిల్డింగ్ నిర్మాణ ప‌నులు చురుగ్గా సాగుతున్నాయి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -