Monday, May 13, 2024
- Advertisement -

మ‌హేశ్ బాబు వ‌ల్ల 150 మంది ప్రాణాలు నిలిచాయాట‌..!

- Advertisement -

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు ఎప్ప‌టిక‌ప్పుడు త‌న మంచి మ‌న‌స్సును చాటుకుంటునే ఉంటున్నాడు. త‌న సినిమాల ద్వారా వ‌చ్చిన డ‌బ్బును స‌మాజం కోసం వినియోగిస్తుంటాడు మ‌హేశ్‌. గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం, నల్గొండ జిల్లాలోని సిద్ధాపురం గ్రామాలను దత్త తీసుకున్న మ‌హేశ్ ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందుతున్నారు. మ‌హేశ్ ఏర్పాటుచేసిన వైద్య శిబిరాల వల్ల ఇప్పటివరకు 150 మంది చిన్నారుల ప్రాణాలు నిలిచాయి.

ఈ విషయాన్ని మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ తన ‘ఇన్‌స్టగ్రమ్’ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ‘‘చిన్నారులకు వైద్య సేవలు అందించేందుకు ఆంధ్ర హాస్పిటల్స్, హీలింగ్ లిటిల్ హార్ట్స్‌ ఫౌండేషన్ మాతో కలిసినందుకు ఎంతో గర్వంగా ఉంది. ఇప్పటివరకు 150 మంది చిన్నారులకు విజయవంతంగా గుండె చికిత్సలు విజయవంతంగా నిర్వహించడం సంతోషం కలిగిస్తోందని తెలిపింది. చిన్నారుల గుండె వ్యాధులపై అవగాహన కల్పించేందుకు సహకరించిన యూకే వైద్య బృందానికి ధన్యవాదాలు’’ అని నమ్రతా పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా త‌న ట్విట్ట‌ర్‌లో ఓ ఫోటోని షేర్ చేసింది మ‌హేశ్ భార్య న‌మ్ర‌త‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -