Monday, April 29, 2024
- Advertisement -

కారెక్కిన మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం

- Advertisement -

మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత డి.కె.అరుణ సోదరుడు చిట్టెం రాంమ్మెహన్ రెడ్డి టిఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. బుధవారం సాయంత్రం ఆయన సిఎం కె.చంద్రశేఖర రావు సమక్షంలో కారెక్కారు. సిఎం కెసిఆర్ ఆయనకు శాలువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో గడచిన 11 సంవత్సరాలుగా కొనసాగుతున్న అక్కా, తమ్ముళ్ల రాజకీయ బంధానికి తెరపడినట్లు అయ్యింది.

తాను టిఆర్ఎస్ లో చేరడం వెనుక ఎవరి ప్రోద్బలం లేదని, తానే ప్రభుత్వ పరితీరు చూసి పార్టీలో చేరానని చేరిక అనంతరం చిట్టెం రాంమ్మెహన్ రెడ్డి చెప్పారు. 2011 సంవత్సరంలో తన తండ్రి చిట్టెం నర్శిరెడ్డి నక్సలైట్ల కాల్పుల్లో మరణించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో రాంమ్మెహన్ రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

మరోవైపు చిట్టిం రాంమ్మెహన్ కాంగ్రెస్ పార్టీని వీడి పొరపాటు చేస్తారని తాను అనుకోలేదని ఆ పార్టీ సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి అన్నారు. రాంమ్మెహన్ తండ్రి తుది క్షణం వరకూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని కెసిఆర్ చూస్తున్నారని, ఆయన చర్యలను ప్రజలు గమనిస్తున్నారని చిన్నారెడ్డి అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -