Friday, May 10, 2024
- Advertisement -

వైసీపీలోకి సినీయర్ లీడర్.. అంతా జగన్ ప్లాన్..

- Advertisement -
Malladi Vishnu May Join Ysr Congress Soon

ఏపీలో.. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి దుకాణం మూసేసుకున్నప్పటికి.. మరో గట్టి దెబ్బ తగిలింది. ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి.. టీడీపీ పార్టీ నేతలతో పాటు.. కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా గాలం వేస్తున్నారు.

ఈ క్రమంలోనే విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లాది విష్ణు వైసీపీలో చేరబోతున్నరని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై ఇప్పటికే.. తన అభిమానులు, పార్టీ కార్యకర్తలతో చర్చలు జరిపారు. వైసీపీ నేతలతో కూడా చర్చలు పూర్తయ్యాయి. ఈ నెల  8, 9 తేదీలలో విజయవాడలో జరిగి ప్లీనరీ సమావేశంలో జగన్ సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరబోతున్నరు.

{loadmodule mod_custom,GA1} 

ఇక 2019 వరకు ఏపీలో కాంగ్రెస్ పార్టీ కోలుకోదనే అవకాశాలు లేవని వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి. వైసీపీ, టీడీపీ మధ్య పోటీ ఉండటంతో.. అందులోను జనసేన, బిజేపీ ప్రభావం కూడా ఉంటుందని కనిపించడంతో.. ఆయన వైసీపీలో చేరనున్నరని సమాచారం. అయితే ఈ వైసీపీలో చేరే విషయంపై మల్లాది విష్ణు మాట్లాడుతూ.. తనపై మీడియానే తప్పుడు ప్రచారం చేస్తుందని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికలకు టీడీపీ, వైసీపీ ఇప్పటి నుంచే రెడీ అవుతున్న క్రమంలో.. వైసీపీ నుండి 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. దీంతో జగన్ పార్టీ కొంత బలహీనపడింది. పార్టీ బలహీనంగా ఉన్నచోట్ల టిడిపిలోని అసంతృప్తులను, ఇతర పార్టీల్లోని బలమైన నేతలపై జగన్ కన్నేశారు. ఇటివలే.. నంద్యాలలో శిల్పా మోహన్ రెడ్డిని టీడీపీ నుండి.. వైసీపీకిలోకి చేరిన విషయం తెలిసిందే. దీని వెనక జగన్ ప్లాన్ ఉందని ఆయన అన్నారు. 

{youtube}4yXbLH5fhCk{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ర‌స‌వ‌త్త‌రంగా జ‌మ్మ‌ల‌మ‌డుగు రాజ‌కీయం… అ ప‌ద‌వులు ఇవ్వ‌క‌పోతే వైసీపీలోకి ….?
  2. వైసీపీకి మ‌రింత పెర‌గ‌నున్న సినీ గ్లామ‌ర్…..?
  3. సోషియ‌ల్ మీడియా అభిమానులు ఎంత‌వ‌ర‌కు వైసీపీ విజ‌యంలో తోడ్ప‌డ‌తారు..?
  4. వీడీపీ అసోసియేట్స్ స‌ర్వే ఫ‌లితాల‌లో వైసీపీకి దిమ్మ‌తిరిగే షాక్‌…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -