Wednesday, May 15, 2024
- Advertisement -

దిల్‌షుక్ న‌గ‌ర్‌లో ప్రేమోన్మాది ఘాత‌కం …ప్రేయ‌సి గొంతు కోసి…తానూ…?

- Advertisement -

హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలి గొంతుకోసి హత్యాయత్నం చేశాడు ఓ ప్రేమోన్మాది. చైతన్యపురిలోని ఓ లాడ్జిలో మంగళవారం (జులై 9) మధ్యాహ్నం ఈ దారుణం చోటుచేసుకుంది. రక్తపు మడుగులో పడి ఆర్తనాదాలు చేసిన యువతిని గుర్తించిన స్థానికులు.. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ పక్కనే పడిఉన్న యువకుణ్ని కూడా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్ద‌రిని వేర్వేరు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌య‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం.

వివ‌రాల్లోకి వెల్తే…నెల్లూరుకు చెందిన వెంకటేష్‌ (22) అనే యువకుడు చైతన్యపురి ప్రాంతంలోని బృందావన్ లాడ్జ్‌లో ఓ గది అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్న సమయంలో తనతోపాటు ఉన్న ప్రియురాలి గొంతుకోసి హత్యాయత్నం చేశాడు.ప్రవీణ్‌ (22) నెల్లూరు జిల్లాకు చెందిన వాడని తెలుస్తోంది. బాధిత యువతి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మనస్విని (22)గా తెలుస్తోంది. వీరిద్దరూ మంగళవారం ఉదయమే లాడ్జిలో గదె అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. ప్రేము వివాద‌మే కార‌ణం అయిఉంటుంద‌ని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -