Friday, May 17, 2024
- Advertisement -

జ‌మ్ముక‌శ్మీర్‌లో కూలిన ఫైట‌ర్ జెట్‌

- Advertisement -

జమ్ము కశ్మీర్‌లోని బుద్గాంలో ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన యుద్ద విమానం మిగ్‌-21 కుప్పకూలిపోయింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు పైలెట్లు మ‌ర‌ణించారు. విమానం కూలిపోయిన ప్రాంతంలో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారని అధికారులు వెల్లడించారు. రొటీన్‌ సైనిక విన్యాసాల్లో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుందా, యుద్ధ సన్నాహక చర్యల్లో భాగంగా ఈ ప్రమాదం జరిగిందా అనే దానిపై స్పష్టత లేదు.

ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. విమానం కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సాంకేతిక సమస్యల కారణంతోనే ఫైటర్ జెట్ క్రాష్ అయింద‌ని స‌మాచారం. ఆర్మీ ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేప‌టికే ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -