గత కొంత కాలంగా దేశంలో ఉగ్రవాదులు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుల్వామా జిల్లా త్రాల్ ప్రాంతంలోని మెయిన్ బస్ స్టాండ్ వద్ద ఉన్న పోలీసుల బృందంపై ముష్కరులు గ్రనేడ్లు విసిరారు.
అయితే ఈ ఘటనలో ఏడుగురు సామాన్య ప్రజలు గాయాలపాలయ్యారు. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. భద్రతా బలగాలు స్థానిక పోలీసులతో కలిసి ముష్కరుల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు.
గత కొంత కాలంగా ముష్కరులు పోలీసులపై ఎటాక్ చేస్తూనే ఉన్నారు. ఈ దాడుల్లో సామాన్య ప్రజలు ఎంతగానో నష్టపోవడమే కాదు.. ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. గత నెల 26న సైతం ఇదే తరహాలో ముష్కరులు త్రాల్ ప్రాంతంలోనే సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై గ్రనేడ్ విసిరారు. ఈ ఘటనలో కూడా ఎవరూ గాయపడలేదు.
ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్!
ప్రస్తుతం అలాంటి ఆలోచనే లేదు… ఫోకస్ అంతా కెరియర్ పైనే: అంజలి