గత కొంత కాలంగా జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు అలజడి సృష్టిస్తున్నారు. భారత జవాన్లు ఎన్నిసార్లు ఈ దాడులు తిప్పికొట్టినా.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పలుమార్లు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా జమ్మూకాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్ పట్టణంలో శనివారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు, మరో ఇద్దరు పౌరులు మరణించారు. జమ్మూలో భీకర ఎన్కౌంటర్ జరిగింది.
బారాముల్లా జిల్లాలోని సోపోర్ పట్టణంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లతో పాటు ఇద్దరు పౌరులు హతమయ్యారు. మరికొందరు సీఆర్పీఎఫ్ సిబ్బందికి, స్థానిక పౌరులకు గాయాలవడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఉత్తర కాశ్మీర్లోని సోపూర్లోని అరంపోరా ప్రాంతంలో పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్త బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
రామ్ సినిమాలో విలన్ గానా.. ఆ వార్తల్లో నిజం లేదన్న తమిళ స్టార్ హీరో..!