- Advertisement -
సినీనటుడు, జనసేన పార్టీ అద్యక్షుడు పవన్ కల్యాన్, నిన్న ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలపై పురపాలక శాఖా మంత్రి నారాయణ స్పందించారు. పవన్ సూచించిన విదంగానే భూసమీకరణ విషయంలో ముందుకు వెళతామని స్పష్టం చేశారు.
ఏ రైతుకు ఇబ్బంది కలిగించబోమని పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్ విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళతామన్నారు. రాజధాని నిర్మాణం కోసం ఇంకా రెండు వేల ఎకరాలు తీసుకోవల్సి ఉందని, ఈ నేపథ్యంలో భూసమీకరణలో భూములివ్వని రైతులకు ఈ నెల 20 తర్వాత నుంచి భూసమీకరణ చేపడతామని ఆయన పేర్కొన్నారు. విజయవాడలో ఏపి సిఎం చంద్రబాబు అద్యక్షతన జరిగిన సమావేశం తర్వాత మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.