Wednesday, May 8, 2024
- Advertisement -

ప్రణయ్‌ హత్య కేసులో సంచ‌ల‌న నిజాలు …

- Advertisement -

పట్టపగలు నడిరోడ్డు మీద పట్టణంలోని జ్యోతి ఆసుపత్రి వద్దప్రణయ్‌ ఓ యువకుడిని దారుణంగా నరికి చంపిన సంఘ‌ట‌న మిర్యాల‌గూడ‌లో సంచ‌ల‌నం రేకెత్తించింది. ప్ర‌ణ‌య్ హ‌త్య ప‌రువు హ‌త్యేన‌ని తేల్చేశారు పోలీసులు.అతడు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమృత కుటుంబ సభ్యులే అతడిని హత్య చేయించారని ఎస్పీ రంగనాథ్ తెలిపారు.

ఆరు మాసాల క్రితం అమృత వర్షిణిని ప్రణయ్ ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. అయితే ఈ పెళ్లి సమయంలోనే ఇరు కుటుంబాల మధ్య పెద్ద గొడవలు జరిగాయి.అయితే కొంత కాలం పాటు ప్రణయ్ మిర్యాలగూడకు దూరంగా ఉన్నాడు. ఇతర ప్రాంతాల్లో ఉండడం కంటే మిర్యాలగూడలోనే ఉండడం సేఫ్ అని ప్రణయ్ భావించాడు.

ఇద్ద‌రి కులాలు వేరు కావ‌డంతో వేర్వేరు కులాలు కావడంతోనే అమృతవర్షిణి తండ్రి మారుతీరావు మిర్యాలగూడలో పెద్ద బిల్డర్. అయితే ఈ పెళ్లి ఆయనకు ఇష్టం లేదని ప్రణయ్ కుటుంబసభ్యులు చెబుతున్నారు. అయితే ఇటీవల అమృతవర్షిణితో అతని తండ్రి మారుతీరావు మాట్లాడడం ప్రారంభించారు. అయితే ఉద్దేశ్యపూర్వకంగానే అమృతవర్షిణితో తండ్రి మాటలు కలిపాడా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రణయ్ కు ప్రాణభయం ఉందని తల్లిదండ్రులు పోలీసు ఉన్నతాధికారులను కూడ ఆశ్రయించినట్టు చెబుతున్నారు.

ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ప్రణయ్‌ది పరువు హత్యే అని తేల్చేశారు.. ప్రణయ్ కుమార్ హత్య కేసులో యువతి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని ఎస్పీ రంగ‌నాథ్‌చెప్పారు. కిరాయి హంతకులతో ప్రణయ్‌ను హత్య చేయించారన్నారు. రూ.10లక్షలు సుఫరీ ఇచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మారుతీరావును ఏ 1గా, మారుతీరావు సోదరుడు శ్రవణ్ ను ఏ 2 పోలీసులు కేసు నమోదు చేశారు.అయితే వీరిద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -