ఇదేదో కొత్త సినిమా టైటిల్ అనుకునేరు. కానే కాదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చందబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ లపై వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్య. తన సస్పెన్షన్ పై సుప్రీం కోర్టును ఆశ్రయించి రోజా అక్కడేం జరుగుతుందో తెలుసుకునేందుకు ఢిల్లీ వెళ్లారు.
ఈ కేసు సోమవారానికి బెంచ్ కు రానుంది.దీంతో ఖాళీగా ఉండడమెందుకు అనుకున్నారో.. ఏమో… శ్రుకవారం నాడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎప్పట్లాగే బాబు, కొడుకులపై మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాటుడుతున్న వారి గొంతు నొక్కేస్తున్నారంటూ గొంతెత్తి మరీ చెప్పారు.
అంతే కాదు అవినీతి రహిత పాలన అంటూ చెప్తున్న చంద్రబాబు అడ్డంగా దోచేస్తున్నారని, దాంట్లో కొంత లోకేష్ దాచేసి మిగిలిన దాంతో ఇతర పార్టీల ఎమ్మెల్యేను కొంటున్నారని మరోసారి మండిపడ్డారు. రెండెకరాలున్న చంద్రబాబు లక్షల కోట్లు ఎలా సంపాదించారని మళ్లీ విమర్శించారు.