- Advertisement -
సొంత లాభం మానుకుని పొరుగు వారికి సాయపడాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. కరోనా మహమ్మారి నియంత్రణ లక్ష్యంగా దేశవ్యాప్త టీకాల పంపిణీ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గురజాడ అప్పారావు రచించిన “దేశమంటే మట్టి కాదోయ్” పద్యాన్ని మోదీ తెలుగులో చెప్పారు.
కొవిడ్ మహమ్మారిపై పోరులో నెలలుగా ఎదురు చూస్తున్న ముహూర్తం రానే వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా చారిత్రక ఘట్టానికి తెరలేచింది. ఏడాదికి పైగా వేధిస్తున్న కరోనా మహమ్మారి నియంత్రణే లక్ష్యంగా.. దేశవ్యాప్త టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 3 వేల 6 కేంద్రాలలో 3 లక్షల మంది ఆరోగ్యకార్యకర్తలకు టీకాలు వేసే కార్యక్రమం మొదలైంది.