- Advertisement -
నేడు మాతృ దినోత్సవం కావడంతో ట్విట్టర్ వేదికగా, వైకాపా అధినేత వైఎస్ జగన్, తన తల్లి విజయమ్మకు అభినందనలు తెలిపారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి ఆమే కారణమని వ్యాఖ్యానించారు. ఈ ప్రపంచంలో అమ్మతనానికి మించిన హీరోయిజం లేదని చెప్పారు.
ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర(160వ రోజు) చేస్తోన్న వైఎస్ జగన్.. నేటి ఉదయం కైకలూరు శివారు నుంచి యాత్రను ప్రారంభించారు. కాకతీయ నగర్, దెయ్యంపాడు, చింతపాడు, కొవ్వాడ లంక మీదుగా మణుగులూరు చేరుకుంటారు. భోజన విరామం అనంతరం కాలకర్రు మీదుగా మహేశ్వరపురం చేరుకుంటారు. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు.
There’s no heroism greater than motherhood. Thank you Amma, for making me what I am today. Happy #MothersDay.
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 13, 2018